ఈ నెలాఖరులోగా పాన్-ఆధార్ లింక్ చేసుకోవాలి, లేదంటే ఏమవుతుంది?
ఆధార్-పాన్ కార్డు అనుసంధానానికి చివరి తేదీ జూన్ 30. ఈ లోగా ఈ రెండింటిని లింక్ చేయకుంటే పాన్ కార్డు పని చేయదు. అప్పుడు బ్యాంకు ఖాతా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, ఇతర ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి ట్రాన్సాక్షన్స్ నిలిచిపోతాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు పాన్-ఆధార్ లింక్ స్టేటస్ను చెక్ చేసుకోవాలి.
ఇప్పటికీ లింక్ చేసుకోనివారు వెంటనే చేసుకోవడం మంచిది. బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం లేకపోతే TDS రెట్టింపు అవుతుంది. ఆధార ఉన్న బ్యాంకు ఖాతాలకు సాధారణంగా టీడీఎస్ 10 శాతం ఉంటుంది. KYC పూర్తి చేయకుంటే మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో ట్రాన్సాక్షన్స్ నిలిచిపోతాయి. ఎందుకంటే కేవైసీకి పాన్ నెంబర్ తప్పనిసరి.
పని చేయని పాన్ కార్డు కారణంగా NSDL, CDDSL పెట్టుబడి రికార్డులను నిల్వ చేయలేనందున స్టేట్మెంట్ పొందడం కష్టంగా ఉంటుందని అంటున్నారు. పని చేయని పాన్కార్డు కారణంగా, రూ.50,000కు మించిన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్కు రూ.10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే జరిమానా విధించవచ్చు.