ముంబై: దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మంగళవారం (అక్టోబర్ 27) స్వల్పంగా పెరిగాయి. పసిడి రూ.51వేల మార్క్ వద్ద తచ్చాడుతోంది. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో రూ.5,000 పైగా తక్కువ పలుకుతోంది. కరోనా నేపథ్యంలో మార్చి నుండి ఆగస్ట్ వరకు పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ కాలంలో రూ.15వేలకు పైగా పెరిగింది.
ఆగస్ట్ రెండో వారం నుండి తిరిగి క్షీణించాయి. ఇప్పుడు రూ.49వేల పై నుండి రూ.52 దిగువన పలుకుతోంది. పండుగ సమయంలో ఆల్ టైమ్ గరిష్టం నుండి రూ.5వేలు తక్కువగా ఉండటం కాస్త ఊరట కలిగించే అంశం. నెల రోజులకు పైగా పసిడి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి.

బంగారం హెచ్చుతగ్గులు
దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో మధ్యాహ్నం గం.1 సమయానికి 10 గ్రాముల డిసెంబర్ ఫ్యూచర్స్ 0.01 శాతం పెరిగి రూ.50,934 పలికింది. రూ.51,065 వద్ద ప్రారంభం కాగా, రూ.51,114 వద్ద నేటి గరిష్టాన్ని, రూ.50,901 వద్ద కనిష్టాన్ని తాకింది. రూ.50,900 వద్ద ట్రేడ్ అయింది.
ఫిబ్రవరి ఫ్యూచర్స్ ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. 0.03 శాతం క్షీణించి రూ.51,050 పలికింది. రూ.51,210 ప్రారంభం కాగా, గరిష్ట ధర అదే. కనిష్టం రూ.51,050.

వెండి ధర పెరుగుదల
బంగారం ధరల్లో పెద్దగా మార్పులేదు. కానీ వెండి ధర పెరిగింది. డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ కిలో రూ.510 (0.82 శాతం) పెరిగి రూ.62,416 పలికింది. రూ.62,341 వద్ద ప్రారంభమైన ధర, రూ.62,580 వద్ద గరిష్టాన్ని, రూ.62,312 వద్ద కనిష్టాన్ని తాకింది.
వెండి మార్చి ఫ్యూచర్స్ రూ.395 (0.62 శాతం) పెరిగి కిలో రూ.64,150 పలికింది. రూ.64,137 వద్ద ప్రారంభం కాగా, రూ.64,250 వద్ద గరిష్టాన్ని, రూ.64,040 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లోను....
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధర స్వల్పంగా పెరిగింది. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.02 శాతం పెరిగి 1,906.15 డాలర్లు పలికింది. 1,903.45 - 1,912.95 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 1905.70 డాలర్ల వద్ద క్లోజ్ అయింది. ఈ ఏడాది పసిడి ధర 24 శాతానికి పేగా ఎగిసింది. సిల్వర్ ఫ్యూచర్స్ 0.71 శాతం లాభపడి ఔన్స్ 24,593 డాలర్లు పలికింది. 24.367 - 24.733 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 24.420 డాలర్లు పలికింది. ఈ ఏడాది వెండి ధర 36 శాతం పెరిగింది.

రూ.50,600 వద్ద కొనుగోలు చేయవచ్చు
ఎంసీఎక్స్లో పసిడి మద్దతు ధర రూ.50,780-50,600. నిరోధకస్థాయి రూ.51,050-51,200. వెండి మద్దతు ధర రూ.61,300-60,800. నిరోధకస్థాయి రూ.62,500-63,300గా ఉండవచ్చు. పసిడి ధరలు రూ.50,600 వద్ద, వెండ రూ.61,300 వద్ద ఉంటే స్వల్ప కాలానికి గాను బంగారాన్ని కొనుగోలు చేయవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

వెండి ధర రూ. 3 లక్షలు.. బంగారం ధర 10 గ్రాములు రూ. 1. 72 లక్షలు.. షాకిస్తున్న ఆర్థిక నిపుణులు అంచనాలు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోండి.. మార్చి 18, బుధవారం ధరలు ఇవే..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications