ఏపీ-తెలంగాణలలో ది గ్రేట్ 2020 ఆఫర్స్: రూ.11,000కే ఎల్ఈడీ టీవీ, హోమ్ థియేటర్!
ప్రముఖ రిటైల్ మొబైల్ విక్రయ సంస్థ celekt mobiles కొత్త ఏడాది (2020), సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ది గ్రేట్ 2020 పేరుతో నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగ ఆఫర్లు ఇచ్చింది. పండుగలు, ప్రత్యేక దినాల్లో ఆయా సంస్థలు లేదా కంపెనీలు ఆఫర్లు ప్రకటించే విషయం తెలిసిందే. సెలక్ట్ మొబైల్ ఆఫర్స్....
గృహసిద్ధి: హోమ్ లోన్ తీసుకునే వారికి LIC సూపర్ ఆఫర్
ది గ్రేట్ 2020
3GB+32GB స్మార్ట్ ఫోన్తో పాటు ఎల్ఈడీ కలిపి రూ.9,999కే అందిస్తోంది. హోమ్ థియేటర్, ఎల్ఈడీ టీవీని రూ.10,999కి అందిస్తోంది. యాపిల్ ఫోన్లపై రూ.2,020 రాయితీ కల్పిస్తోంది. ఒప్పో, వివో, ఎంఐ ఫోన్లపై దాదాపు 50 శాతం తక్కువకు విక్రయిస్తోంది.
రూ.8వేల యాక్సెసరీస్ రూ.2,020కే
రూ.8వేల విలువైన యాక్సెసరీస్ను కేవలం రూ.2,020కే అందిస్తోంది సెలక్ట్ మొబైల్స్. జోడి ఫోన్ను రూ.2,020కి ఇస్తోంది. యాక్సెసరీలపై 80 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. సెలక్ట్ మొబైల్ స్టోర్స్ను సందర్శించి మరిన్ని ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి తెలుసుకోవచ్చు.
సంక్రాంతి వరకు.. మూడు రాష్ట్రాల్లో ఆఫర్లు
ది గ్రేట్ 2020 పేరుతో ఇచ్చే ఈ ఫెస్టివ్ ఆఫర్లు సంక్రాంతి పండుగ వరకు ఉంటాయి. ఈ ప్రత్యేక ఆఫర్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలోని 63 సెలక్ట్ స్టోర్లలో లభిస్తాయి. ఈ ఆఫర్లను సోమవారం టాలీవుడ్ నటి మెహ్రీన్ ప్రారంభించారు. కాగా, ప్రస్తుతం ఉన్న ఈ స్టోర్ల సంఖ్యను వచ్చే ఏడాది చివరి నాటికి 100కు పైగా పెంచుకోనున్నట్లు కంపెనీ డైరెక్టర్ చెప్పారు.