ట్రంప్‌ 50% టారిఫ్‌లు ఈరోజు నుంచే అమలు..... భారత్ కు 48 బిలియన్ డాలర్ల నష్టం

అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన 50% టారిఫ్‌ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రభావం భారత్‌కు పెద్ద దెబ్బే. ఎందుకంటే అమెరికాకు భారత్‌ చేసే ఎగుమతుల్లో దాదాపు 2/3 వంతు డైరెక్ట్ గా ప్రభావితం అవుతోంది. అంటే సుమారు 48 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ఈ టారిఫ్‌ల ప్రభావం వల్ల భారత్‌కి, కోవిడ్‌ కన్నా దారుణమైన పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.

Donald Trump tariffs India-US trade impact Export losses Textile and jewellery exports Export Promotion Mission India Bilateral Trade Agreement BTA U S import duties India export crisis Job loss in export sector

ఈ 50% టారిఫ్ రెండు విడతల్లో అమల్లోకి వచ్చింది. మొదట జూలైలో 25% బేస్ డ్యూటీని ప్రకటించారు. తర్వాత ఆగస్టులో అదనంగా 25% పెనాల్టీ డ్యూటీ విధించారు. కారణం భారత్ ఇంకా రష్యా నుండి చమురు, రక్షణ సామగ్రి కొనుగోలు చేస్తుంది కాబట్టి దీనికి అమెరికా వ్యతిరేకిస్తోంది. అందుకే పెనాల్టీ రూపంలో రెండో టారిఫ్ జోడించారు. ఇది ఆగస్టు 27 ఉదయం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. అయితే కొన్ని రంగాలకు మాత్రం మినహాయింపులు ఇచ్చారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్, పెట్రోలియం ప్రొడక్ట్స్ (30% ఎగుమతులు) టారిఫ్ ఫ్రీగా ఉన్నాయి. ఆటో పార్ట్స్‌పై 25% పన్ను, మిగతా అన్ని వస్తువులపై నేరుగా 50% పన్ను విధించారు. దీని వలన అమెరికా మార్కెట్లో భారత వస్తువులు ఖరీదై, కోనే శక్తి తగ్గిపోతోంది.

ఈ కొత్త టారిఫ్ వల్ల భారత్‌లోని ప్రధాన ఎగుమతి రంగాలు తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. ముఖ్యంగా టెక్స్టైల్స్, దుస్తులు ($10.9 బిలియన్), వజ్రాలు, రత్నాలు, జ్యువెలరీ ($10 బిలియన్), మెషినరీ, అప్లయెన్సెస్ ($6.7 బిలియన్), వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్డ్ ఫుడ్ ($6 బిలియన్), స్టీల్, అల్యూమినియం, కాపర్ ($4.7 బిలియన్), ఆర్గానిక్ కెమికల్స్ ($2.7 బిలియన్), సముద్ర ఆహారం, రొయ్యలు ($2.4 బిలియన్), అలాగే హ్యాండిక్రాఫ్ట్స్, కార్పెట్స్, లెదర్, ఫర్నిచర్ ($5 బిలియన్‌కి పైగా) వంటి రంగాలు ఎక్కువ నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. తిరుపూర్ (టెక్స్టైల్స్), నోయిడా (అపారెల్), సూరత్ (డైమండ్స్), విశాఖ (సముద్ర ఆహారం), జోధ్‌పూర్ (హ్యాండిక్రాఫ్ట్స్) వంటి పరిశ్రమా కేంద్రాలు గట్టిగా దెబ్బతింటున్నాయి. క్రిసిల్ రేటింగ్స్ అంచనా ప్రకారం కొన్ని రంగాల్లో 70% వరకు ఎగుమతులు తగ్గిపోవచ్చు. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు భారత్ ఎగుమతులు 43% పడిపోవచ్చు.

తగ్గిన భారత్ మార్కెట్ షేర్‌ని ఇతర దేశాలు లాభంగా మలుచుకుంటాయి. ముఖ్యంగా వియత్నాం, బంగ్లాదేశ్, చైనా, టర్కీ, ఇండోనేషియా, మెక్సికో దేశాలు అమెరికా మార్కెట్లో మరింత ప్రాధాన్యం పొందే అవకాశం ఉంది. ఇవి ఇప్పటికే తక్కువ ధరలకు వస్తువులు సరఫరా చేస్తుండగా, భారత వస్తువులు ఖరీదయ్యే సరికి ఈ దేశాలు డిమాండ్‌ను తీరుస్తాయి.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం రూ. 25,000 కోట్ల ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ప్రకటించింది. దీని కింద ఎగుమతిదారులకు సులభ రుణాలు (ట్రేడ్ ఫైనాన్స్, క్రెడిట్ సపోర్ట్), టెక్స్టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు GST మార్పులు, జ్యువెలరీ వంటి రంగాలకు టారిఫ్‌లో కొంత రీయింబర్స్‌మెంట్ సహాయం, SEZలలో సంస్కరణలు, అలాగే బ్రాండ్ ఇండియా పేరుతో గ్లోబల్ ఈ-కామర్స్, వేర్‌హౌసింగ్ ప్రోత్సాహం ఉన్నాయి. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ, అమెరికాపై ప్రతీకార చర్యలు ఉండవు కానీ ఎగుమతిదారులు, ఉద్యోగాలను రక్షించడానికి పాలసీ, ఫిస్కల్, డిప్లొమాటిక్ అన్ని మార్గాలు ఉపయోగిస్తామని తెలిపారు.

భారత్-అమెరికా మధ్య ప్రస్తుతం బిలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ (BTA) పై చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆగస్టు 25న జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడింది. దీంతో వేగం తగ్గింది. ఇంతలో భారత్ అమెరికాపై ఆధారాన్ని తగ్గించడానికి యూరోపియన్ యూనియన్, యూకే, ఇతర దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ (FTAs) పూర్తిచేయడానికి ప్రయత్నిస్తోంది.

మొత్తంగా, అమెరికా కొత్త టారిఫ్ భారత్‌కు పెద్ద సవాలు. ముఖ్యంగా టెక్స్టైల్, జ్యువెలరీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఎగుమతి ప్రోత్సాహక పథకాలతో, ఇతర దేశాలతో కొత్త ఒప్పందాల ద్వారా నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+