Covid 19: ఇక్కడ నియామకాలు ఆగలేదు! 'టాప్' టాలెంట్ కోసం కంపెనీల సెర్చింగ్
కరోనా మహమ్మారి కారణంగా ఎన్నో కంపెనీలు నష్టాల్లోకి వెళ్లి ఉద్యోగాల కోత, వేతన కోత బాటపట్టాయి. సుదీర్ఘ లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మరో ఆరు నెలల నుండి ఏడాదికి గాని కోలుకునే పరిస్థితి లేదు. దీంతో కంపెనీలు జాబ్ కట్ లేదా శాలరీ కట్ లేదా నియామకాలు నిలిపివేయడం వంటివి చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త ఉద్యోగాలు కష్టమేననే అంచనాలు ఉన్నాయి. అయితే కొన్ని కంపెనీలు ఇదే సమయంలో హైరింగ్స్తో పాటు టాలెంట్ కోసం సెర్చ్ చేస్తున్నాయట.
పెట్రోల్, డీజిల్పై వినియోగదారులకు భారీ షాక్!: ప్రపంచంలోనే అత్యధిక ట్యాక్స్ వసూలు
ఖాళీలు ఉన్నాయ్!
క్యాప్జెమిని, గోల్డ్మన్ సాక్స్ సహా వివిధ కంపెనీలు ఇండియాలో అగ్రశ్రేణి ప్రతిభావంతుల కోసం సెర్చ్ చేస్తున్నాయట. టెక్, డిజిటల్, కోర్ డొమైన్ స్పెషలిస్ట్స్ కోసం చూస్తున్నాయట. ఓ డేటా ప్రకారం గత వారంలో 200 కంటే ఎక్కువ డైరెక్టర్ స్థాయి, అంతకుపైస్థాయి పోస్టులు అందుబాటులో ఉన్నాయట. గోల్డ్మన్ సాక్స్, వేదాంత, క్యాప్జెమిని వంటి సంస్థలు వారు నియామకాలు జరుపుతున్నట్లు వెల్లడించినట్లు ఓ పత్రికలో వచ్చింది.
బెస్ట్ టాలెంట్ను నియమించుకుంటాం
కరోనా మహమ్మారి సమయంలో తాము బెస్ట్ టాలెంట్ను నియమించుకుంటున్నామని గోల్డ్మన్ సాక్స్ ఇండియా హెడ్ ఇటీవల తెలిపారు. వేదాంత సామర్థ్యం పెంచుకోవడానికి సముచిత టెక్నికల్ హైరింగ్స్ను ఫిల్ చేస్తోంది. తాము టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కోసం వెతుకుతున్నామని వేదాంత గ్రూప్ ఆఫీసర్ వెల్లడించారు.
అదే దారిలో..
ఎగ్జిక్యూటివ్ సెర్చ్ ఫర్మ్ ట్రాన్సెర్చ్ ఇరవై మంది టాప్ టాలెంట్ను నియమించుకుంటోంది. డిజిటల్, క్లౌడ్, డేటా అనలిస్ట్ వంటి న్యూఏజ్ టెక్నాలజీస్లో టాప్ టాలెండ్ కోసం చూస్తోంది. ప్రస్తుతం ఇండియాలో హైరింగ్ ఫ్రీజ్ చేయలేదని ఈ కంపెనీ సీహెచ్ఆర్వో ఇండియా వెల్లడించారు.