ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ పతనం ఇవ్వాళ కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టపోయాయి. సెన్సెక్స్లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి.. ఒక్క బ్యాంకింగ్ సెగ్మెంట్ తప్ప. ఐటీ, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్.. ఇలా అన్నీ కీలకమైన బెంచ్మార్క్ ఇండైసెస్ అన్నీ నష్టపోయాయి. మైనస్లల్లో పడిపోయాయి. బ్యాంకింగ్ సెక్టార్కు సంబంధించిన షేర్లు మాత్రం కొంత కళకళలాడాయి.

300 పాయింట్లు లాస్..
ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 303.35 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ కూడా అదే బాటలో నడిచింది. 54,060 పాయింట్లతో ఇవ్వాళ సెన్సెక్స్ ట్రేడింగ్ ఆరంభమైంది. ఒక దశలో 54,197 పాయింట్లను సైతం టచ్ చేసింది. అక్కడి నుంచి కిందికి జారింది దీని గ్రాఫ్. నేల చూపులు చూస్తూ సాగింది ఇవ్వాళ్టి దాని ప్రయాణం.

కొంత కోలుకున్నా..
చివరిగంటలో కోలుకున్నట్టే కనిపించింది. రికవరీ అవుతుందనుకున్న దశలో మళ్లీ కూలింది. మధ్యాహ్నం 2:20 నిమిషాల సమయంలో 53,981 పాయింట్ల వరకు వెళ్లింది గానీ.. ఎక్కువ సేపు అక్కడే స్థిరంగా నిలవలేకపోయింది. ఒకదశలో 53,730 పాయింట్లకు క్షీణించింది. ట్రేడింగ్ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు కొంత పుంజుకొంది మార్కెట్. చివరికి 53,749.26 పాయింట్ల వద్ద ఇవ్వాళ్టి ట్రేడింగ్ ముగిసింది. నిఫ్టీ ప్రయాణం కూడా సాఫీగా సాగలేదు. 99 పాయింట్లకు పైగా నష్టపోయింది. 16,025.80 పాయింట్ల వద్ద దీని ట్రేడింగ్ క్లోజ్ అయింది.

ఏసియన్ పెయింట్.. పేటీఎం..
ఇవ్వాళ భారీగా నష్టపోయిన షేర్లల్లో పేటీఎం, ఏసియన్ పెయింట్స్ ఉన్నాయి. 247 రూపాయల మేర నష్టపోయింది ఏసియన్ పెయింట్స్ షేర్ ధర. ఈ ఉదయం రూ.3,034.90 పైసల వద్ద దీని ట్రేడింగ్ ఆరంభమైంది. తొలి గంట నుంచే పతనావస్థలో కనిపించింది. మధ్యాహ్నానికి 247.85 రూపాయలను నష్టపోయింది. 2,839 వద్ద ట్రేడింగ్ ముగిసింది. పేటీఎం షేర్ ఒక్కింటికి రూ.54.95 పైసలు నష్టపోయింది. 647 రూపాయలతో ఆరంభమైన ట్రేడింగ్.. రూ.591.50 పైసల వద్ద ముగిసింది.

అదే దారిలో ఎల్ఐసీ..
ఇటీవలే మార్కెట్లో డెబ్యూ అయిన జీవిత బీమా సంస్థ షేర్లల్లో మహా పతనం కొనసాగుతూనే వస్తోంది. రూ.8.95 పైసల మేర నష్టపోయిందీ షేర్ ధర. ఈ ఉదయం రూ.831.50 పైసల వద్ద ఆరంభమైన ఈ ఎల్ఐసీ షేర్ల ట్రేడింగ్ రూ.814.95 పైసల వద్ద ముగిసింది. వీటితో పాటు అదాని పోర్ట్స్, దివిస్ ల్యాబ్స్, యూపీఎల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, నిఫ్టీలో టాప్ లూజర్స్గా నిలిచాయి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, భారతి ఎయిర్టెల్ లాభపడ్డాయి.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

డబుల్ బెడ్ రూంకు నెలకు రూ. లక్ష అద్దె.. ముంబైలో హౌస్ రెంట్పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!



Click it and Unblock the Notifications