ముంబై: దేశీయ భారత స్టాక్ మార్కెట్లు గురువారం(అక్టోబర్ 22) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.16 సమయానికి సెన్సెక్స్ 71.54 పాయింట్లు (0.18%) క్షీణించి 40,635.77 వద్ద, నిఫ్టీ 25.50 పాయింట్లు(0.21%) నష్టపోయి 11912.20 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. సెన్సెక్స్ ఓ దశలో 180 పాయింట్లకు పైగా క్షీణించినప్పటికీ, ఆ తర్వాత నష్టాలు తగ్గాయి.
492 షేర్లు లాభాల్లో, 443 షేర్లు నష్టాల్లో ప్రారంభం కాగా, 39 షేర్లలో ఎలాంటి మార్పులేదు. నేడు ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఆటో, భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, ఎస్బీఐ కార్డ్స్ పేమెంట్ సర్వీసెస్, హెక్సావేర్ టెక్నలజీస్, ఇండియన్ బ్యాంకు, బయోకాన్ త్రైమాసిక ఫలితాలు ఉన్నాయి.

ఐటీ, రియాల్టీ, మీడియా మాత్రమే లాభాల్లో..
అన్ని రంగాలు కూడా ఈ రోజు నష్టాల్లో సాగుతున్నాయి.
రూ.6000 కోట్ల నిధుల సమీకరణకు గ్రాండ్ ఫార్మాకు సెబీ ఆమోదం తెలిపింది.
నిఫ్టీ బ్యాంకు, నిఫ్టీ ఆటో, నిఫ్టీ ఫైనాన్స్ సర్వీస్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు నష్టాల్లో కనిపించాయి.
నిఫ్టీ ఐటీ, నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియాల్టీ మాత్రమే లాభాల్లో ట్రేడ్ అయ్యాయి.
డాలర్ మారకంతో రూపాయి 73.76 వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 73.58 వద్ద ముగిసింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్
ఉదయం గం.11 సమయానికి టాప్ గెయినర్స్ జాబితాలో అదానీ పోర్ట్స్, బ్రిటానియా, టాటా మోటార్స్, ఓఎన్జీసీ, లార్సన్ ఉన్నాయి.
టాప్ లూజర్స్ జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, హిండాల్కో, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ ఉన్నాయి.
మోస్ట్ యాక్టివ్ జాబితాలో రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంకు, అల్ట్రా టెక్ సిమెంట్ ఉన్నాయి.
బజాజ్ ఫిన్ సర్వ్ 3 శాతం లాభపడింది. రెండో క్వార్టర్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈ స్టాక్స్ ఎగిశాయి.
రెండు రోజుల పాటు నష్టాల్లో ఉన్న బ్రిటానియా నేడు లాభాల్లోకి వచ్చాయి. 1.40 శాతం లాభపడి రూ.3,445 వద్ద ట్రేడ్ అయింది.

ఐటీ స్టాక్స్లో హెచ్చుతగ్గులు..
టీసీఎస్ షేర్ ధర 0.58 శాతం నష్టపోయి రూ.2,660 వద్ద ట్రేడ్ అయింది. హెచ్సీఎల్ టెక్ 0.029 శాతం నష్టపోయి రూ.870.60, ఇన్ఫోసిస్ షేర్ 0.33 శాతం క్షీణించి రూ.1,144.50, టెక్ మహీంద్ర 0.79 శాతం నష్టపోయి రూ.840 వద్ద, కోఫోర్జ్ 1.55 శాతం నష్టపోయి రూ.2,472 వద్ద ట్రేడ్ అయింది.
మైండ్ ట్రీ 3 శాతం ఎగిసి రూ.1395.45 వద్ద, విప్రో 0.28 శాతం ఎగిసి రూ.344 వద్ద ట్రేడ్ అయింది.
ఐటీ స్టాక్స్ లాభాల్లో ప్రారంభమై, ఆ తర్వాత హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి.
More From GoodReturns

మార్కెట్ క్రాష్ సమయంలో ఇన్వెస్టర్లకు నగదు చాలా కీలకం.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

హెచ్డిఎఫ్సి షేర్లు భారీగా పతనం.. చైర్మన్ రాజీనామాతో పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. గంటల వ్యవధిలో రూ. 9 లక్షల కోట్లు ఆవిరి.. లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు..

స్టాక్ మార్కెట్లో అతి పెద్ద బ్లాక్ డీల్.. 16 లక్షల టాటా షేర్లను అమ్మేసిన Radhakishan Damani..ఎందుకంటే..

ఇరాన్ యుధ్దం.. రేసు గుర్రంలా దూసుకుపోతున్న స్టాక్స్ ఇవే.. ఓ కన్నేసి ఉంచండి..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications