నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ 200 పాయింట్లు డౌన్

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం (మే 7) నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 218 పాయింట్లు లేదా 0.69 శాతం తగ్గి 31,467 వద్ద, నిఫ్టీ 58.65 పాయింట్లు లేదా 0.63% తగ్గి 9,212.25 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. HCL టెక్, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ ఉదయం టాప్ గెయినర్స్ జాబితాలో ఉన్నాయి. హిందూస్థాన్ యూనీలివర్, కొటక్ మహీంద్రా, ఓఎన్జీసీలు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. బుద్ధపూర్ణిమ సందర్భంగా ఈ రోజు కరెన్సీ మార్కెట్ క్లోజ్ ఉంది.

మధ్యాహ్నం సమయానికి భారతీ ఇన్ఫ్రాటెల్, అదానీ పోర్ట్స్, ఇండస్ ఇండ్ బ్యాంకు, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకు టాప్ గెయినర్స్ జాబితాలో ఉండగా, ఓఎన్జీసీ, బీపీసీఎల్, కొటక్ మహీంద్రా బ్యాంకు, టైటాన్ కంపెనీ, విప్రో టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి.

Sensex dips 200 points, Nifty above 31,500

స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిసిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండు రోజులు నష్టపోయిన మార్కెట్ నిన్న మాత్రం సెన్సెక్స్ 232 పాయింట్ల లాభంతో 31,686 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు ఎగిసి 9,271 వద్ద క్లోజ్ అయింది. బ్యాంకింగ్, వాహన, ఫైనాన్స్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్వల్ప లాభాల్లోకి వచ్చింది. కానీ ఈ రోజు తిరిగి నష్టాల్లోకి వెళ్లింది. నిన్న డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు పెరిగి 75.72 వద్ద ముగిసింది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+