కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు లేక వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడం లేదా వేతనాల్లో కోత విధించడం చేస్తున్నాయి. కరోనా ప్రభావం దేవుడిపై కూడా పడింది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర దేశవ్యాప్త లాక్ డౌన్ ప్రకటించింది. దీంతో దేవాలయాలు, చర్చిలు, మసీదులు క్లోజ్ అయ్యాయి. అయితే ప్రార్థనాలయాల్లో కూడా ఉద్యోగాల తొలగింత కనిపిస్తోంది.

1,300 మంది కాంట్రాక్టు కార్మికుల తొలగింత
కరోనా, లాక్ డౌన్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) బోర్డుకు మ్యాన్పవర్ను సరఫరా చేసే ఏజెన్సీలు పలువురు ఉద్యోగులను ఇంటికి పంపించాయి. టీటీడీతో మ్యాన్పవర్ సరఫరా చేసే సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందం ఏప్రిల్ 30వ తేదీతో ముగిసింది. దీంతో పనులు నిలిచిపోయి 1,300 మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించినట్లుగా వార్తలు వస్తున్నాయి. గుడిలో పని చేసే శానిటేషన్, హాస్పిటాలిటీ కాంట్రాక్టు వర్కర్లకు మే 1వ తేదీ నుండి పనిలోకి రావొద్దని చెప్పారు.

మానవతా దృక్పథంతో పరిశీలిస్తాం
ఏప్రిల్ 30వ తేదీతో ముగిసిన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదని చెబుతున్నారు. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ.. మ్యాన్ పవర్ను సరఫరా చేసే సంస్థల సేవలు నిలిచినట్లుగా తెలిసిందని, మానవతా దృక్పథంతో దీనిని పరిశీలిస్తామని ఆయన ఊరట కలిగించారు.

లాక్ డౌన్ కారణంగా...
టీటీడీ, మ్యాన్ పవర్ ఏజెన్సీ మధ్య ఒప్పందం ఏప్రిల్ 30వ తేదీతో ముగిసిందని, సాధారణంగా ఈ సమయానికి కొత్త టెండర్లు పిలుస్తారని, లాక్ డౌన్ కారణంగా టీటీడీ బోర్డు భేటీ కాలేదని, దీంతో టెండర్లు ఖరారు కాలేదని టీటీడీ అధికార ప్రతినిధి ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నిబంధనల మేరకు అంతా జరిగిందని, పైగా ఇప్పుడు కార్మికులకు పని లేదని, అన్ని గెస్డ్ హౌస్లు మూసివేయబడ్డాయని చెబుతున్నారు. కరోనా కారణంగా తిరుమలతో పాటు టీటీడీ పరిపాలనలోని 50 ఉద దేవాలయాలు కూడా మూసివేయబడ్డాయి. 128 ఏళ్లలో ఆలయం మూసివేయడం ఇదే తొలిసారి.

వీ-వర్క్లో ఉద్యోగాల కోత
ఇదిలా ఉండగా, వివిధ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తోన్న విషయం తెలిసిందే. కో వర్కింగ్ కంపెనీ వీ-వర్క్ ఇటీవల ఉద్యోగులను తొలగించింది. వీ-వర్క్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సందీప్ మాట్లాడుతూ.. మరిన్ని ఉద్యోగాల కోత ఉంటుందని ముందే చెప్పామని, గత ఏడాదితో పాటు ఈ మార్చిలోనే 240 మంది ఉద్యోగులను తొలగించినట్లు చెప్పారు. లాక్ డౌన్ నేపథ్యంలో కార్యకలాపాలు ముందుకు సాగడం లేదని, కాబట్టి ఈ వారంలో ఉద్యోగాల కోతతో పాటు వచ్చే నెలలోను మరిన్ని కోతలు ఉండవచ్చునని వార్తలు వస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications