హైదరాబాద్: లాక్ డౌన్ తర్వాత తెలంగాణలో పారిశ్రామిక రంగం అనుసరించాల్సిన వైఖరి, కొత్త వ్యాపార అవకాశాలు ఇతర అంశాలపై దార్శనిక పత్రం రూపొందించాలని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు శనివారం CIIని కోరారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఎంఎస్ఎంఈలు సహా అన్ని రంగాల్లోని పారిశ్రామిక వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. లైఫ్ సైన్సెస్, మెడికల్ రంగాల్లోని అవకాశాలను సద్వివినియోగం చేసుకోవాలన్నారు.

ఉద్యోగాలు తొలగించవద్దు
శనివారం కేటీఆర్ సీఐఐ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నష్టాల పేరుతో ఉద్యోగులను తొలగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు లేదా లాక్ డొన్ తర్వాత సిబ్బందిని తొలగించవద్దని కోరారు. ఒక్క ఉద్యోగి కూడా ఉపాధి కోల్పోకుండా చొరవ తీసుకోవాలన్నారు. ఉద్యోగులను తీసివేయకుండా మరో మార్గంలో ఖర్చులు తగ్గించుకోవాలని సూచించారు.

ఇలా చేయండి..
వేతనాల తగ్గింపు, బోనస్ వాయిదా, ఇంక్రిమెంట్ వాయిదా వంటి వాటి ద్వారా ఖర్చులు తగ్గించుకోవాలన్నారు. ప్రస్తుతం కరోనా కారణంగా ఆర్థికంగా అన్ని రంగాలు గడ్డు పరిస్థితుల్లోనే ఉన్నాయని కేటీఆర్ చెప్పారు. లాక్ డౌన్ వల్ల పారిశ్రామిక రంగం వివిధ రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోందని, ఉత్పత్తి లేక ఆదాయం కోల్పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ దెబ్బతింటోందన్నారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల పట్ల యాజమాన్యాలు దయతో వ్యవహరించాలన్నారు. ఎలాంటి పరిస్థితులైనా ఉద్యోగులను తొలగించరాదన్నారు.

సీఎం సహా జీతాలు తగ్గించుకున్నారు
ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఉన్నతాధికారులు, ఉద్యోగులు కూడా వేతనాలు తగ్గించుకున్నారని కేటీఆర్ గుర్తు చేశారు. కంపెనీ యజమానులు బాధ్యతాయుత పౌరులుగా ఉద్యోగుల భద్రతకు కృషి చేయాలన్నారు. వివిధ రంగాలు మళ్లీ పూర్వవైభవం పొందేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం వేతనాలు కట్ చేసి వాయిదా పద్ధతుల్లో చెల్లించాలని నిర్ణయించామన్నారు. దీనిని పరిగణలోకి తీసుకోవాలన్నారు.

త్వరలో పరిశ్రమలు పుంజుకుంటాయి
లాక్ డౌన్ తర్వాత త్వరలో పరిశ్రమలు పుంజుకుంటాయని, ఉద్యోగుల భద్రతకు యాజమాన్యాలు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరించారు. లాక్ డౌన్ అనంతరం పరిశ్రమల కొనసాగింపునకు సంబంధించి సలహాలు, సూచనలు స్వీకరిస్తామన్నారు. లాక్ డౌన్కు అన్నివర్గాల నుంచి సహకారం అందుతోందని, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్నిరకాలుగా సిద్ధంగా ఉందన్నారు.

ఆర్థిక వ్యవస్థలో 25 శాతం మాత్రమే..
తెలంగాణకు అవసరమైన వ్యక్తిగత రక్షణ పరికరాలు, మాస్కులు, వెంటిలెటర్లు, పరీక్షల కిట్స్తో సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో 25 శాతం తన కార్యకలాపాలను కొనసాగిస్తోందని, లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత పరిశ్రమలను పూర్తిస్థాయిలో నడపడం, కార్మికుల విశ్వాసాన్ని పెంపొందించే బాధ్యత యాజమాన్యాలపై ఉందన్నారు. పరిశ్రమల యాజమాన్యాలు కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద అత్యవసర మౌలిక వసతుల కల్పనకు సహకరించాలని చెప్పారు.
More From GoodReturns

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!



Click it and Unblock the Notifications