న్యూఢిల్లీ: ఇటీవల పెంచిన రైల్వే ఛార్జీలు ఏడాదిలో రైల్వే నమోదు చేసిన రూ.55 వేల కోట్ల నష్టంలో కేవలం 5 శాతాన్ని మాత్రమే భర్తీ చేయగలిగామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఈ భారం ప్రయాణీకులపై స్వల్పంగానే ఉంటుందని చెప్పారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు.

ఛార్జీల పెంపు సున్నితం.. అందుకే
2004లో ప్రయాణీకుల సర్వీసులో రూ.8వేల కోట్ల నష్టం వాటిల్లిందని, ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా ప్రయాణీకుల సర్వీసుల విభాగంలో రూ.55వేలకోట్ల నష్టాలు వచ్చాయని గోయల్ చెప్పారు. ప్రయాణ ఛార్జీల పెంపు చాలా సున్నితమైన అంశమన్నారు. అందుకే చాలా తక్కువ ఛార్జీలు పెంచినట్లు చెప్పారు.

ఖర్చులు పెరిగినా.. స్వల్పంగా పెంపు
సబర్బన్ రైళ్లకు పెంచలేదని, నాన్ సబర్బన్ రైళ్లలో కిలో మీటరుకు ఒక పైసా పెంచారని, మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలోని నాన్-ఏసీ బోగీలకు కిలో మీటరుకు రెండు పైసలు, ఏసీ బోగీలకు కిలో మీటరుకు నాలుగు పైసలు పెంచినట్లు వెల్లడించారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల అమలు తర్వాత ఖర్చులు మరింత పెరిగినప్పటికీ ఛార్జీలను అతి స్వల్పంగా పెంచినట్లు తెలిపారు.

సముద్రంలో నీటి చుక్క
చార్జీల పెంపును సముద్రంలో నీటి చుక్కగా అభివర్ణించారు. ప్రయాణీకులకు అందించే సేవలు, సౌకర్యాలస్థాయిని పెంచుకుంటూ వస్తోందన్నారు. స్టేషన్ల శుభ్రత, సమయపాలన, ట్రాక్స్ భద్రత, పాత పరికరాల స్థానంలో కొత్త వాటిని సమకూర్చుకోవడం వంటి విషయాల్లో రైల్వే ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. అలాంటి సమయంలో స్వల్పంగా ఛార్జీలు పెంచకుంటే ప్రయాణీకులకు సేవలు అందించడం కష్టమవుతుందన్నారు.

జనవరి నుంచి పెంపు..
ఇండియన్ రైల్వేస్ ఇటీవల ఛార్జీలను స్వల్పంగా పెంచింది. పెంచిన ఛార్జీలు జనవరి 1, 2020 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆర్డినరీ సెకండ్ క్లాస్, స్లీపర్ క్లాస్కు కిలో మీటర్కు ఒక పైసా చొప్పున పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మెయిల్ సెకండ్ క్లాస్, ఫస్ట్ క్లాస్కు కిలో మీటర్కు 2 పైసల చొప్పున పెంచారు. ఏసీ చైర్ కార్, ఏసీ 3,2 టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్కు కి.మీ.కు 4 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సబర్బన్ రైళ్లలో మాత్రం ఛార్జీలు పెంచలేదు. మోడీ అధికారంలోకి వచ్చాక 2014లో ఛార్జీలు పెంచారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications