ఇంటి అద్దెల నుంచి కంపెనీల ఒప్పందాల వరకు ప్రతి దానికీ ఒక కాంట్రాక్టు (ఒప్పందం) ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో ఆయా ఒప్పందాలను ఉల్లంఘించటం చూస్తుంటాం. అంటే వివాదం నెలకొనటం. వివాదాల పరిష్కారం కోసం అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సార్లు వివాదాలను ఇరువురు పార్టీలు సామరస్య పూర్వకంగా పరిష్కరించుకుంటాయి. కానీ ఇలాంటివి కేవలం 5 % నుంచి 10% లోపే. చాలా సందర్భాల్లో మాత్రం వివాదాలు కోర్టులకు లేదా ట్రిబ్యునల్స్ కు వెళుతుంటాయి. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న విషయమే కాక... వెంటనే తేలవు. ఏళ్ళ తరబడి వేచి చూడాల్సి వస్తుంది.
ఒక ఇంటి అద్దె విషయంలో నెలకొన్న వివాదంలో కోర్టును ఆశ్రయిస్తే... అది తేలేవరకు ఒక ఇంటిని కొనుగోలు చేసేంత ఖర్చు అవుతుందని కొన్ని జోకులు కూడా ఉన్నాయి. ఇందులో వాస్తవం కూడా లేకపోలేదు. వివాదం చిన్నదా... పెద్దదా అనే తేడా లేకుండా దాని పరిష్కారానికి పట్టే సమయం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఇటీవల కోర్టులు ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వం) సూచిస్తున్నాయి. ఇద్దరికీ ఆమోదయోగ్యమైన ఒక న్యాయ నిపుణుడు ఇరువురి వాదనలు విని తీర్పునిస్తారు. సదరు తీర్పు ఇద్దరికీ నచ్చితే.. దానిని కోర్టులో నమోదు చేసి, వివాదం పరిష్కారం అయినట్లు పేర్కొంటారు. దీంతో సమయం కలిసివస్తుంది. కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. కానీ బాగా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే ఇటీవల కొన్ని కంపెనీలు కొత్త విధానాలు అనుసరిస్తున్నాయి.

నెస్ట్ అవే ...
అవసరమే నవకల్పనలకు మార్గం చూపుతుందని అంటారు. సరిగ్గా అలాగే రెంటల్ హోమ్ సర్వీసెస్ లో నిమగ్నమైన నెస్ట్ అవె అనే స్టార్టుప్ కంపెనీ తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త వివాద పరిష్కార వేదికను సిద్ధం చేసింది. తమ సేవలు తీసుకుంటున్న సుమారు 75,000 మంది వినియోగదారులకు ఇది వర్తిస్తుంది. ప్రధానంగా ఇంటి యజమాని, అద్దెకు ఉండే వారి మధ్య వివాదం నెలకొంటుంది. రెంట్ విషయం లో కానీ... సౌకర్యాలు, ఇతరత్రా అంశాల్లో ఇవి ప్రధానంగా మొదలవుతాయి. ఇలాంటి వాటికోసం కోర్టులు, ట్రిబ్యునల్స్ ను ఆశ్రయించటం వల్ల డబ్బు, విలువైన సమయం వృధా అవుతున్నాయని నిర్వహించిన నెస్ట్ అవె వారికోసం ఒక వెబ్ ఆధారిత వివాద పరిష్కార వేదికను అందుబాటులోకి తీసుకొచ్చింది. ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో ఈ విషయాన్నీ వెల్లడించింది. ఈ విధానంలో రెండు పార్టీలు, ఆన్లైన్ వేదికగా సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ లలో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవటం, అవసరమైతే... వీడియో కాల్ లో మాట్లాడుకోవటం చేస్తున్నారు. దీంతో అటు సమయం, ఇటు డబ్బు అదా అవుతోంది.
పే పాల్...
వెబ్ ఆధారిత వివాద పరిష్కారం మనకు కొత్త కానీ ... ఇలాంటి విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో అందుబాటులో ఉంది. పే పాల్ వంటి పేమెంట్ సేవలు అందించే సంస్థలు వాటి వినియోగదారులకు ఆన్లైన్ లోనే సమస్య పరిష్కారాన్ని చూపుతాయి. సేవ లోపం, ఉత్పత్తి లో లోపాలు ఉంటె సదరు వినియోగదారు నేరుగా పే పాల్ లో ఒక కేసు రిజిస్టర్ చేస్తారు. ఆ కేసుతో సంబంధం ఉన్న వినియోగదారునికి పే పాల్ కేసు వివరాలు తెలుపుతుంది. అలాగే ఆ వివాదానికి సమానమైన సొమ్మును బ్లాక్ చేసి, వివాదం పరిష్కారం ఐన తర్వాత దానిని విడుదల చేస్తుంది. దీంతో చాలా వేగంగా సమస్య పరిష్కారం అయిపోతుంది. ఒక వేల దీనికి ఎవరైనా ఒక పార్టీ ఒప్పుకోకపోతే... వారి అకౌంట్ బ్లాక్ లిస్ట్ లో పెడతారు. అంటే ఇకముందు పే పాల్ లో వారు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా చూస్తారు. అందుకే వినియోగదారులు కూడా వీలైనంత త్వరగా వివాదాలను పరిష్కరించుకుని ముందుకు వెళతారు.
లక్షల్లో పెండింగ్ కేసులు...
దేశంలో చిన్నా పెద్ద వివాదాలు కొన్ని లక్షల్లో పెండింగ్ లో ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది కోర్ట్ మార్గం లో వివాద పరిష్కారానికి అవకాశం ఉన్నా... కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం దేశంలోని హై కోర్టుల్లో 45.6 లక్షల కేసులు పెండింగులో ఉన్నాయి. జిల్లా కోర్టుల కు వచ్చే సరికి ఆ సంఖ్య 3.15 కోట్లకు పెరిగింది. వివిధ జాతీయ స్థాయి ట్రిబ్యునల్స్ లో మరో 3,50,000 వివాదాలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. వీటన్నిటికీ కొంత చెక్ పెట్టాలంటే... టెక్నాలజీ ని విరివిగా వినియోగించాల్సిందేనని, అది మాత్రమే అటు డబ్బు, ఇటు సమయాన్ని అదా చేసి వేగవంతమైన పరిష్కారాలను చూపగలదని నిపుణులు అభిప్రాయతుడుతున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?

బంగారం ధరలు పెరుగుదలపై షాకింగ్ న్యూస్..అసలైన కారణం తెలిపిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ సచిన్ జైన్..

Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!



Click it and Unblock the Notifications