2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్ తయారీలో సవాళ్లు ఉన్నప్పటికీ బంగారం వంటి అవకాశాలు ఉంటాయని మాజీ చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ శంకర్ ఆచార్య అన్నారు. 2021-22 బడ్జెట్ కొన్ని వారాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటి వరకు ఏ ఆర్థిక మంత్రి ఎదుర్కోని సవాల్ ఇప్పుడు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ముందు ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కరోనా ఆర్థికంగా అత్యంత పెనుసవాళ్లను విసిరింది. స్వతంత్ర్య భారతంలో అతి క్లిష్టమైన సవాల్ను ఎదుర్కొంటోంది నిర్మలమ్మే అని అంటున్నారు.

కోలుకుంటున్న భారతావని
కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతంగా నమోదయింది. ఇప్పటికి కేసులు కోటి దాటాయి. కరోనా నుండి మూడు నాలుగు నెలలుగా కోలుకుంటుండటంతో ఆర్థిక కార్యకలాపాలు కాస్త పెరిగాయి. అందుకే రెండో త్రైమాసికంలో జీడీపీ ఊహించిన క్షీణత కంటే కాస్త తగ్గింది. మైనస్ 9 శాతం దాటుతుందని అంచనా వేయగా, మైనస్ 7.5 శాతంగా నమోదయింది. రిటైల్ ద్రవ్యోల్భణం చాలా నెలలుగా ఆరు శాతం కంటే పైన ఉంది. ఉపాధి రేటు క్యూ2లో 38 శాతం కంటే తక్కువగా ఉంది. క్యూ1లోని 31 శాతం కంటే మెరుగుపడింది.

Q2, Q3 సానుకూలంగా...
కేంద్ర ఆర్థిక లోటు... జీడీపీలో 8 శాతంగా ఉంటుంది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలుపుకుంటే 12 శాతం నుండి 13 శాతంగా నమోదు అవుతుంది. ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో ఆదాయాలు భారీగా పడిపోవడంతో ప్రభావం పడింది. మర్చంటైజ్డ్ ఎగుమతి వృద్ధి ఇప్పటికీ ప్రతికూలంగా ఉంది. నెలవారీ డాలర్ స్థాయిలు 2011-12 స్థాయికి పడిపోయింది. దిగుమతులు తగ్గాయి. చమురు ధరలు తగ్గడంతో మిగులు ఖాతా నమోదయింది. మూడు, నాలుగో త్రైమాసికాల్లో జీడీపీ వరుసగా 0.1 శాతం, 0.7 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. FY21, FY22 రియల్ జీడీపీ, ద్రవ్యోల్భణం వంటివి అనిశ్చితిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యతాయుతమైన బడ్జెట్ తయారీ పెద్ద సవాల్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

అంచనాలు ఇలా..
ఆర్బీఐ, ఆర్థిక శాఖలు Q2, Q3లపై సానుకూల ధోరణితో ఉన్నాయి. అయితే Q2, Q3లలో గతంలో కంటే సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రతికూలంగానే ఉండే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు. 2020-2021 రెండో అర్ధ సంత్సరంలో 0.4 శాతం పాజిటివ్ వృద్ధిని ఆర్బీఐ అంచనా వేస్తుంటే, మైనస్ 2-4 శాతంగ అంచనా వేస్తున్నారు శంకర్ ఆచార్య. 2020-2021 పూర్తి సంవత్సరానికి ఆర్బీఐ మైనస్ 7.5 శాతంగా అంచనా వేస్తుండగా, శంకర్ ఆచార్య మైనస్ 9-10 శాతం అంచనా వేస్తున్నారు. వాస్తవానికి 2021-2022లో రీబౌండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉందని అంటున్నారు. 10 శాతం నుండి 11 శాతంగా ఉంటుందని భావిస్తున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications