ఇతర నెట్ వర్క్స్ నుంచి బీఎస్ఎన్ఎల్కు మారుతున్న యూజర్లు
మొబైల్ నెంబర్ పోర్టబులిటీ (MNP) ఆప్షన్తో ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్ వర్క్స్కు మారేవారి కంటే ఇతర ఆపరేటర్ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారే వారి సంఖ్యనే ఎక్కువగా ఉందని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ అన్నారు. 2018-19లో పోర్టబుల్ ఆప్షన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ నుంచి ఇతర నెట్ వర్క్స్కు మారిన వారి సంఖ్య 28.27 లక్షలు కాగా, ఇతర నెట్ వర్క్స్ నుంచి బీఎస్ఎన్ఎల్కు వచ్చిన వారి సంఖ్య 53.64 లక్షలుగా ఉంది.
టెలికం కష్టాలు: అప్పుల్లో కూరుకుపోయి...
2019 ఏడాదిలో అక్టోబర్ నాటికి 2.04 కోట్ల మేర పోర్ట్ ఇన్స్ ఉండగా, 1.80 కోట్ల మేర పోర్ట్ అవుట్స్ ఉన్నాయి. ఆగస్ట్ 31వ తేదీ నాటికి బీఎస్ఎన్ఎల్ మొబైల్ కనెక్షన్ల సంఖ్య 11.64 కోట్లుగా ఉందని రవిశంకర ప్రసాద్ లోకసభలో తెలిపారు.
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులకు వీఆర్ఎస్కు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందని తెలిపారు. బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతానికి ప్రభుత్వరంగ టెలికం సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని చెప్పారు.