భారత్కు చెందిన కంపెనీలు అన్నికూడా నియామకాలు చేపడుతున్నాయి. ప్రధానంగా ఐటీ సంస్థలు ఉద్యోగ నియామకాల్లో జోరు పెంచాయి. కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. భారత్లో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకు గురి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత ఐటీ రంగం భారీ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశీయసంస్థలు చాలామంది ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమయ్యాయి. కరోనా కారణంగా గత ఏడాది నియమకాలు అంతంత మాత్రమే. కానీ ఈసారి పుంజుకుంటున్నాయి.

నియామకాలు జూమ్
కార్పొరేట్ రంగంలో డిజిటలైజేషన్ కారణంగా ఐటీ సేవలకు ఎనలేని డిమాండ్ నెలకొంది. ఇందులో భాగంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ ఐటీకంపెనీలు వేలాదిమంది సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు ప్రకటించాయి. గత ఏడాది నియమించుకున్న వారితో పోలిస్తే 45 శాతం వరకు అధికంగా ఉండవచ్చునని అంటున్నారు. అంటే లక్ష మందికి ఉపాధి కల్పించనున్నాయి. లింక్డిన్ ఫ్యూచర్ ఆఫ్ టాలెంట్ రిపోర్ట్లోను ప్రతి 10 కంపెనీల్లో 9 కంపెనీలు (93 శాతం) నియామకాలు వేగవంతం చేయనున్నట్లు తెలిపాయి.

నియామకాలు పెంచుకుంటున్నాయి
ప్రతి పది కంపెనీల్లో ఏడు కంపెనీలు తమ అంతర్గత దృక్పథం, పురోగతి కోసం నియామకాలు పెంచుకుంటున్నట్లు తెలిపాయి. భారత్లో కంపెనీలు నియామకాలు చేపట్టే సమయంలో ప్రధానంగా మూడు అంశాలను చూస్తాయి. మంచి కమ్యూనికేషన్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, టైమ్ మేనేజ్మెంట్ను చూస్తాయి. ఈ సర్వే భారత్తో పాటు ఆస్ట్రేలియా, చైనా, ఇండియా, జపాన్, మలేషియా, పిలిప్సీన్, సింగపూర్ దేశాల్లో చేశారు.

ఐటీ దూకుడు
ఉద్యోగ నియామకాల్లో TCS దూకుడును ప్రదర్శిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 వేలమంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఇటీవల ప్రకటించింది. మరోవైపు ఇన్ఫోసిస్ 26 వేలమందిని, HCL టెక్నాలజీస్ కూడా 12 వేలమందిని తీసుకోనున్నాయి. డేటా అనలటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్లో నైపుణ్యం కలిగిన వారిని తీసుకోవడానిక ిసంస్థలు క్యూ కడుతున్నాయి.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications