ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుండి రూపే కార్డులు, బీమ్-యూపీఐ మార్గంలో చెల్లింపులు జరిపిన వారికి విధించిన ఛార్జీలను రీఫండ్ చేయాలని బ్యాంకులకు ఆదాయపు పన్ను శాఖ సూచించింది. మున్ముందు కూడా ఈ రెండు విధానాల్లో జరిపే ట్రాన్సాక్షన్స్ పైన ఎలాంటి ఛార్జీలు విధించవద్దని ఆదేశించింది. 2020 జనవరి 1వ తేదీ నుండి నిర్దేశిత ఎలక్ట్రానిక్ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) సహా ఇతర ఎలాంటి ఛార్జీలు ఉండవని గత ఏడాది డిసెంబర్ నెలలో సీబీడీటీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో రూపే కార్డ్స్, భీమ్-యూపీఐ ద్వారా జరిగిన డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన వసూలు చేసిన ఛార్జీల్ని తిరిగి కస్టమర్లకు చెల్లించాలని ఆదాయపుపన్ను శాఖ బ్యాంకులకు సూచించింది. జనవరి 1 నుంచి వసూలు చేసిన ఛార్జీలను తక్షణమే చెల్లించాలని ఆదేశించింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఐటీ చట్టంలోని సెక్షన్ 269 ఎన్యూను అనుసరించి ఈ డిజిటల్ లావాదేవీలపై బ్యాంకులు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయకూడదు.

డిజిటల్ లావాదేవీల పెంపు, నగదు రహిత ఆర్తిక వ్యవస్థను రూపొందించేందుకు గాను ఫైనాన్స్ యాక్ట్, 2019లో కేంద్రం ఈ సెక్షన్ను చేర్చింది. రూపే డెబిట్ కార్డు, భీమ్-యూపీఐ, క్యూఆర్ కోడ్లను నిర్దేశిత ఎలక్ట్రానిక్ వ్యవస్థల కింద నోటిఫై చేసింది. కాబట్టి డిజిటల్ రూపంలో పేమెంట్స్ చేసిన వారికి ఛార్జీలు వర్తించవు. అలాగే వీటికి ఎలాంటి MDR వర్తించబోదని తేల్చిచెప్పింది. నిర్దేశించిన లావాదేవీలు దాటిన తర్వాత యూపీఐ పేమెంట్స్పై కొన్ని బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సీబీడీటీ దృష్టికి రావడంతో ఈ సర్కూలర్ జారీ చేసింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..



Click it and Unblock the Notifications