ఐటీ కంపెనీల్లో సగటు ఆట్రిషన్ (వలసలు) రేటు 17 శాతం గరిష్టానికి చేరుకుంది. అధిక వలసల రేటు నేపథ్యంలో ఐటీలో ఫ్రెషర్స్కు మరిన్ని అవకాశాలు స్వాగతం పలుకుతున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల నుండి కూడా వలసల రేటు భారీగా పెరిగింది. ఐటీ రంగంలో వలసల రేటు పది శాతం నుండి పదిహేడు శాతానికి పెరిగింది.
మరిన్ని త్రైమాసికాలు ఇదే పరిస్థితి కొనసాగుతుందని భావిస్తున్నారు. ప్రధానంగా డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరగడంతో వలసల రేటు పెరగడం, తద్వారా ఫ్రెషర్స్కు మరిన్ని ఉద్యోగ అవకాశాలు రావడం గమనార్హం. హైదరాబాద్, బెంగళూరు.. ఇలా అన్ని నగరాల్లోను వలసల రేటు ఎక్కువగానే ఉంది.

ఉద్యోగుల వలసల రేటు
ఐటీ రంగంలో ఉద్యోగుల వలసల శాతం వేగంగా పెరుగుతోంది. కరోనా పరిణామాల ప్రభావంతో, డిజిటల్ సేవల విస్తరణ పెరిగి ఐటీ కంపెనీలకు వినూత్న, భారీ ప్రాజెక్టులు లభిస్తున్నాయి. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీ, ఏఐతో కూడిన ప్రాజెక్టులు పెరిగాయి. దీంతో ఆయా విభాగాల్లో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు ఐటీ రంగానికి లేదా కంపెనీలకు ఎక్కువగా అవసరం వస్తోంది. దీంతో ఇంజినీరింగ్, కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్లను ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి. అనుభవజ్ఞులైన లేదా నిపుణులైన ఉద్యోగులకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.
పని చేస్తోన్న కంపెనీలో అయితే ఏడాదికి 5 శాతం నుండి 10 శాతం శాలరీ పెరుగుతుంది. కంపెనీ మారితే 20 శాతం నుండి 30 శాతం ఎక్కువ వేతనం వస్తోంది. కొన్ని కంపెనీలు యాభై శాతం వరకు కూడా ఇస్తున్నాయి. అధిక వేతనం ఇస్తుండటంతో కంపెనీలు మారడానికి ఎక్కువమంది ఉద్యోగులు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల కాలంలో ఈ ధోరణి ఎక్కువ అయినట్లు ఐటీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అందుకే ఐటీ ఉద్యోగుల వలసల రేటు 17 శాతం వరకు ఉన్నట్లు చెబుతున్నారు.

వలసల రేటు ఎక్కువగా ఉంది
దేశీయంగా ఐటీ సేవల్లో ఉన్న దిగ్గజ కంపెనీల్లో వలసల రేటు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అయితే ఏడాది రెండేళ్ల తర్వాత పరిస్థితి సాధారణ స్థితికి రావొచ్చునని అంటున్నారు. కరోనా కారణంగా ఏడాదిన్నరగా ఉద్యోగులు ఇంటి నుండి పని చేస్తున్నారు. ఆన్లైన్లో తమకు కేటాయించిన పని చేస్తూనే, ఇతర సమయంలో డిజిటల్ టెక్నాలజీల్లో కొత్త నైపుణ్యాలకు సంబంధించిన మెళకువలు నేర్చుకుంటున్నారు. ఆన్ లైన్ ద్వారా కొత్త టెక్నాలజీని నేర్చుకొని, అధిక జీతభత్యాలు లభించే కంపెనీలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఎక్కువ వేతనం..
ఆన్లైన్ ద్వారా డిజిటల్ టెక్నాలజీని నేర్చుకొని, ఎక్కువ వేతనం లభించే కంపెనీలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం క్లౌడ్ ఇంజినీర్లు, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, ఏఐ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఆటోమేషన్ విభాగాల్లో ఐటీ కంపెనీలకు ప్రాజెక్టులు అధికంగా లభిస్తున్నాయి. ఈ నైపుణ్యాలు గల ఐటీ ఉద్యోగుల కోసం కంపెనీలు అన్వేషిస్తున్నాయి.
More From GoodReturns

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

Hyderabad:హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మారుతున్న నగరం ముఖచిత్రం.. కొత్త ఫ్లైఓవర్లు ఇవే!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

30 వేల మంది ఉద్యోగుల తొలగింపు అంతా ఫేక్.. లేఆప్స్పై క్లారిటీ ఇచ్చిన టెక్ మహీంద్రా..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..



Click it and Unblock the Notifications