అమెరికా 12.5 శాతం సుంకాలపై విరుచుకుపడిన భారత్.. ఏకపక్ష నిర్ణయం సరికాదని మండిపాటు..

యుఎస్ ప్రతిపాదించిన 12.5 శాతం అదనపు దిగుమతి సుంకంపై భారతదేశం కీలక సూచనలు చేసింది. ఇరు దేశాల మధ్య తలెత్తే ఎలాంటి వాణిజ్య వివాదాలనైనా ఏకపక్ష నిర్ణయాల ద్వారా కాకుండా.. పరస్పర చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR) నిర్వహించిన బహిరంగ విచారణలో భారత వాణిజ్య శాఖ జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా పాల్గొని.. ఈ ప్రతిపాదనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

సెక్షన్ 301 కింద అమెరికా జరిపిన దర్యాప్తు నివేదికలో అనేక లోపాలు, వైరుధ్యాలు ఉన్నాయని.. కాబట్టి అదనపు పన్ను విధించాలనే నిర్ణయాన్ని, ఆ దర్యాప్తును అమెరికా పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. వెట్టిచాకిరి లేదా బలవంతపు కార్మిక వ్యవస్థ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతిని నిషేధించడంలో కొన్ని దేశాలు విఫలమయ్యాయనే అమెరికా ఆరోపణలను భారతదేశం పూర్తిగా తిరస్కరించింది. బలవంతపు కార్మిక వ్యవస్థను నిర్మూలించడం భారతదేశ రాజ్యాంగ విధి అని.. తమ దేశం అంతర్జాతీయ చట్టాలను తూచా తప్పకుండా పాటిస్తుందని భారత్ స్పష్టం చేసింది.

India US Trade India US Trade News US Tariff 12 5 Tariff Bilateral Trade Talks Trade Deal India Exports US Imports International Trade Global Trade Business News India Economy US Economy Tariff News 12 5

జూలై 8న విడుదలైన USTR లిఖితపూర్వక నివేదికలో భారతదేశ దర్యాప్తు పద్ధతిని పూర్తిగా తప్పుగా చిత్రీకరించారని జాయింట్ సెక్రటరీ బ్రిజ్ మోహన్ మిశ్రా పేర్కొన్నారు. వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301(D) ప్రకారం ఉండాల్సిన చట్టపరమైన ప్రమాణాలు ఈ నివేదికలో లేనే లేవన్నారు. ఎటువంటి నిర్దిష్ట ఆధారాలు లేకుండా.. బలవంతపు కార్మికులతో కూడిన వస్తువుల దిగుమతిని భారతదేశం నిషేధించదనే ఊహ కేవలం అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు.

కేవలం కొన్ని ఎంపిక చేసిన ఆర్థిక వ్యవస్థల కేస్ స్టడీస్.. సాధారణ వాణిజ్య డేటా ఆధారంగా అమెరికా ఈ నివేదికను తయారు చేసిందని భారత్ వాదించింది. ఎటువంటి బలమైన ఆధారాలు లేకుండా భారతదేశంతో సహా 46 విభిన్న ఆర్థిక వ్యవస్థలను ఒకే వర్గంలో చేర్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. భారత విధానాల వల్ల అమెరికా పరిశ్రమలు నష్టపోతున్నాయనే దానికి ఎలాంటి సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది.

Also Read

వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ శ్రేయాన్స్ గుప్తా.. వ్యవసాయ, ప్రాసెస్ చేసిన ఆహార ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (APEDA) తరపున గట్టిగా వాదనలు వినిపించారు. భారత బియ్యం దిగుమతులపై అమెరికా చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. భారతదేశం నుండి బలవంతంగా బియ్యం దిగుమతులు జరగడం వల్ల అమెరికా మార్కెట్లో స్థానిక బియ్యం అమ్మకాలు దెబ్బతింటున్నాయనే ఆరోపణల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు.

అమెరికా నుండి భారతదేశానికి వచ్చే బియ్యం విలువ, భారత్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంలో 3 శాతం కంటే తక్కువగా ఉందని, కేవలం కొన్ని రకాల బియ్యానికి ఉన్న ప్రత్యేక డిమాండ్‌ను తీర్చడానికి మాత్రమే భారత్ చాలా తక్కువ పరిమాణంలో బియ్యాన్ని దిగుమతి చేసుకుంటుందని ఆయన వివరించారు. లోపభూయిష్టమైన బియ్యం దేశం దాటకుండా భారత్‌లో కఠినమైన నిబంధనలు ఉన్నాయని.. అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యం కేవలం భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖలో నమోదైన మిల్లులు, ప్రాసెసింగ్ యూనిట్ల నుండి మాత్రమే వస్తుందని పేర్కొన్నారు. ఈ ఆధారాల నేపథ్యంలో.. అమెరికా ఈ విచారణను తక్షణమే నిలిపివేయాలని, ఒకవేళ విచారణ ముగిసినా భారతీయ బియ్యానికి ఈ అదనపు పన్ను నుండి పూర్తి మినహాయింపు ఇవ్వాలని భారతదేశం డిమాండ్ చేసింది.

భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక సంస్థలైన FICCI, CII కూడా ఈ టారిఫ్ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ అదనపు పన్ను విధింపు వల్ల కేవలం భారతీయ ఎగుమతిదారులకు మాత్రమే కాకుండా, అమెరికన్ తయారీదారులు, దిగుమతిదారులు, రిటైలర్లు, చివరికి అక్కడి సామాన్య వినియోగదారులపై తీవ్ర ద్రవ్యోల్బణ (ధరల పెరుగుదల) భారం పడుతుందని FICCI హెచ్చరించింది. భారత పరిశ్రమలు ఇప్పటికే అన్ని అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నాయని.. ఈ ఏకపక్ష పన్ను నిర్ణయం బలమైన అమెరికా-భారత సరఫరా గొలుసును దెబ్బతీస్తుందని పేర్కొంది. భారతదేశ విధానాలు అమెరికా వ్యాపారాలకు హాని కలిగిస్తున్నాయని నిరూపించడంలో USTR పూర్తిగా విఫలమైందని CII స్పష్టం చేసింది.

కాగా మార్చి 2026లో బలవంతపు కార్మిక వ్యవస్థ, అధిక పారిశ్రామిక సామర్థ్యం వంటి ఆందోళనల ఆధారంగా USTR ప్రపంచవ్యాప్తంగా 60 దేశాలపై దర్యాప్తు ప్రారంభించింది. జూన్ 3న విడుదల చేసిన తదుపరి నివేదికలో కెనడా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, పాకిస్తాన్ వంటి దేశాలపై 10 శాతం.. భారతదేశం, చైనాతో సహా 54 దేశాలపై 12.5 శాతం అదనపు సుంకాలను విధించాలని ప్రతిపాదించింది. అయితే ఇది కేవలం ప్రాథమిక ప్రతిపాదన మాత్రమే కాబట్టి.. USTR తుది నిర్ణయం తీసుకునే ముందు అన్ని దేశాల అభ్యంతరాలను, వాదనలను నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+