కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు వరుసగా లాక్ డౌన్ను కొనసాగిస్తున్నారు. తొలుత ఏప్రిల్ 14 వరకు, రెండో విడత మే 3 వరకు, మూడో విడత మే 17 (లాక్ డౌన్ 3.0 వరకు కొనసాగించారు. లాక్ డౌన్ 3.0 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకి మరింత ప్రమాదమని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎకానమీ అండ్ ఇండస్ట్రీపై కరోనా ప్రభావంపై CII సీఈవోలు అంచనా వేశారు.

ఆదాయం ఎంత తగ్గుతుందంటే
వరుసగా మూడోసారి లాక్ డౌన్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ భారీగా క్షీణించడంతో పాటు ఆర్థిక పునరుజ్జీవానికి కనీసం ఏడాది పట్టవచ్చునని అంచనా వేశారు. ఈ సర్వేలో 300 మందికి పైగా సీఈవోల పాల్గొన్నారు. ఇందులో మూడింట రెండొంతుల మంది MSMEలకు చెందినవారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ఆదాయం 40 శాతానికి రెవెన్యూ పడిపోతుందని 65 శాతం మంది భావించారు. 33 శాతం సంస్థలు 40 శాతం ఆదాయం పడిపోతుందని, 32 శాతం సంస్థలు 20 శాతం నుండి 40 శాతం ఆదాయం తగ్గుతుందని అంచనా వేశాయి.

కోలుకోవడానికి ఏడాది
ఒక నెల క్రితం సీఐఐ నిర్వహించిన ఇదే స్నాప్ పోల్లో ఆదాయాలు 10 శాతం వరకు తగ్గుతాయని అంచనా వేశారు. ఇప్పుడు ఈ ఆదాయాలు 40 శాతం తగ్గుతాయని ఎక్కువ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రతి నాలుగు సంస్థల్లో మూడు కార్యాలయాలు క్లోజ్ అయి ఉన్నాయని, ఇది ఆర్థిక వ్యవస్థకు ప్రధాన అవరోధంగా చెబుతున్నారు. ఓపెన్ చేసి ఉన్న వాటికి కూడా ఉత్పత్తులు లేక గిరాకీ లేదని చెప్పారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదురుకోవడానికి కనీసం ఏడాది పడుతుందని సీఈవోలు అభిప్రాయపడ్డారు.

దేశీయ డిమాండ్ కంటే..
భారత ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఏడాది పట్టవచ్చునని 45 శాతం మంది సీఈవోలు అభిప్రాయపడ్డారు. త్వరగా కోలుకుంటాయని 34 శాతం మంది చెప్పారు. అంటే 6 నెలల నుండి 12 నెలల్లో కోలుకుంటాయని అభిప్రాయపడ్డారు. తమ ఉత్పత్తులకు సంబంధించి దేశీయ డిమాండ్ కంటే విదేశీ డిమాండ్ త్వరగా రికవరీ అయ్యే అవకాశముందని చెప్పారు.

ఉద్యోగ నష్టాల అంచనా
లాక్ డౌన్ ముగిసిన తర్వాత కంపెనీల్లో ఉద్యోగ నష్టాలు ఉంటాయని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల కోత 15 శాతం నుండి 30 శాతం ఉండవచ్చునని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. మరో మూడింట రెండొంతుల మంది తమ సంస్థలలో ఇప్పటి వరకు అయితే ఉద్యోగాల కోత లేదా వేతన కోత లేదని చెప్పారు.

భారీ ఉద్దీపన అవసరం
సీఐఐ డైరెక్టర్ చంద్రజిత్ బెనర్జీ పరిశ్రమకు భారీ ఉద్దీపన ప్యాకేజీ అవసరమని చెప్పారు. కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు లాక్ డౌన్ కచ్చితంగా అవసరమేనని, దీంతో ఆర్థిక కార్యకలాపాలపై ప్రభావం పడిందని, కాబట్టి ఆర్థిక పునరుజ్జీవం కోసం ఉద్దీపన ప్యాకేజీ అవసరమని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications