Deficit: కరోనా అనంతర ఆర్థిక మందగమనం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎగుమతి & దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయం వల్ల భారత కరెంట్ ఖాతా లోటు (CAD) విపరీతంగా పెరిగింది. ముడి చమురు ఇంపోర్ట్స్, సాఫ్ట్ వేరు సహా వివిధ రంగాల్లో పెరిగిన ఎక్స్ పోర్ట్స్ వల్ల లోటు కొంత తగ్గుముఖం పట్టినట్లు RBI తెలిపింది. గత త్రైమాసికంతో పోలిస్తే భారీగా పడిపోయినట్లు వెల్లడించింది.
అక్టోబర్-డిసెంబర్ మధ్య దేశ కరెంట్ ఖాతా లోటు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్లో నమోదైన 3.7 శాతం, 2021లో అక్టోబర్-డిసెంబర్ లోని 2.7 శాతంతో పోలిస్తే భారీగా పడిపోయినట్లు చెప్పింది. 2022 డిసెంబరుతో ముగిసిన క్వార్టర్లో CAD 2.2 శాతంగా ఉన్నట్లు RBI మార్చి 31న వివరించింది.

దేశీయ కరెంట్ ఖాతా లోటు అక్టోబర్-డిసెంబర్ కాలంలో 18.2 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు RBI డేటా చెబుతోంది. జూలై-సెప్టెంబర్ కు సంబంధించి సవరించిన 30.9 బిలియన్ డాలర్ల కంటే ఇది చాలా తక్కువేనని తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల్లో ఏర్పడిన గణనీయమైన పెరుగుదల వల్ల భారత CADలో క్షీణత ఏర్పడినట్లు సెంట్రల్ బ్యాంకు పేర్కొంది.
2022-23 Q2తో పోలిస్తే Q3లో కరెంట్ ఖాతా లోటు తగ్గడంతో వాణిజ్యలోటు 78.3 బిలియన్ డాలర్ల నుంచి 72.7 బిలియన్లకు పడిపోయిందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. బలమైన సేవల రంగం మరియు ప్రైవేట్ బదిలీ రసీదులు కలిసి CAD తగ్గుదలలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. చమురు దిగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఇండియా కరెంట్ ఖాతా లోటు విషయంలో ఈ ఉత్పత్తుల ధర కీలక అంశం. కాగా గత త్రైమాసికంలో బ్యారెల్ కు 97.9 డాలర్లుగా ఉన్న ముడిచమురు బాస్కెట్ ధర అక్టోబర్-డిసెంబర్ నాటికి 85.8కి పడిపోయినట్లు పెట్రోలియం ప్లానింగ్ & అనాలసిస్ సెల్ ప్రకటించింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications