ఎంత చేసినా.. వ్యాక్సీన్ వస్తేనే, 79% ఆదాయంపై ప్రభావం: ఆర్థిక వ్యవస్థపై సర్వే

కరోనా మహమ్మారి కారణంగా తమ ఆదాయంపై తీవ్రమైన ప్రభావం పడిందని PwC ఇండియా సర్వేలో 79 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే 52 శాతం మంది రానున్న పన్నెండు నెలల్లో ఆర్థిక రికవరీ చోటు చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా వ్యక్తులు, సంస్థలపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే. డిమాండ్ లేక ఆదాయాలు తగ్గడం, వేతనాల్లో కోత, ఉద్యోగాల కోత చోటు చేసుకుంది. ఇటీవలే రికవరీ ప్రారంభమైంది. రష్యా వ్యాక్సీన్ వచ్చింది. ఇతర దేశాల వ్యాక్సీన్స్ సిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో PwC ఇండియా సర్వే నిర్వహించింది.

వ్యాక్సీన్ వస్తేనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది

వ్యాక్సీన్ వస్తేనే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది

కరోనా వ్యాధికి వ్యాక్సీన్ త్వరగా రావాల్సిన అవసరం ఉందని, దేశ ఆర్థిక పునరుజ్జీవనానికి అది ఎంతో ముఖ్యమని ఈ అకౌంటింగ్, కన్సల్టింగ్ సేవల సంస్థ PwC ఇండియా సర్వే నివేదికలో వెల్లడైంది. కరోనా వెలుగు చూడగానే లాక్ డౌన్ విధించడంతో వైద్య, ఆరోగ్య సదుపాయాలను సమాయత్తం చేయగలిగినట్లు ఎక్కువమంది తెలిపారు. కరోనా పరీక్షలను పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు ఆసుపత్రుల్లో పడకలు సిద్ధం చేయడానికి వెసులుబాటు కలిగిందని తెలిపింది. ఇంత జరిగినా ఆర్థిక వ్యవస్థ రికవరీకి టీకా ఆవిష్కరణ ఎంతో ముఖ్యమని, అలాగే వ్యాక్సీన్ వచ్చాక ఎక్కువ జనాభా కలిగిన మనలాంటి దేశంలో దీని పంపిణీ పెద్ద సవాల్ అని పేర్కొంది.

ఇవన్నీ దెబ్బతిన్నాయి

ఇవన్నీ దెబ్బతిన్నాయి

కరోనా వల్ల డిమాండ్, సప్లై చైన్ పైన తీవ్ర ప్రభావం పడిందని, 1979 తర్వాత తొలిసారి తీవ్ర ఆర్థిక మాంద్య పరిస్థితులు నెలకొన్నాయని తెలిపింది. ప్రజల కొనుగోలు శక్తి క్షీణించింది. దీనికి తోడు లాక్ డౌన్ సమయంలో మైగ్రేంట్ వర్కర్స్ సొంత ప్రాంతాలకు తరలి వెళ్లారు. సప్లై చైన్ దెబ్బతిన్నది. జీడీపీలో 75 శాతం వాటా కలిగిన 9 రంగాలపై కరోనా ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు తెలిపింది. కేవలం ఆరోగ్యం, భద్రతారంగాల్లో కొత్త ఉత్పత్తులకు, సేవలకు డిమాండ్ పెరిగింది.

ఆర్థిక వ్యవస్థకు దోహదం

ఆర్థిక వ్యవస్థకు దోహదం

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ తిరిగి ఎప్పుడు కోలుకుంటుందో చెప్పడం కష్టమని PwC ఇండియా పేర్కొంది. 2020 రెండో అర్ధ సంవత్సరంలో రికవరీ పూర్తిగా సాధ్యం కాదని తెలిపింది. మౌలిగ సదుపాయాల ప్రాజెక్టులు, ఆరోగ్య రంగం పైన ప్రభుత్వం వెచ్చించే నిధులు ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ఉపకరిస్తాయని తెలిపింది. ప్రభుత్వ వ్యయం జీడీపీలో 11.8 శాతంగా ఉంది. 2023 నాటికి ఇది మరో 5 శాతం నుండి 7 శాతం వరకు పెరుగుతుందని అంచనా వేసింది. నిరుద్యోగం కొంత తగ్గిందని, అయితే 11 శాతంగా ఉందని ఇది ఆందోళనకరమేనని అభిప్రాయపడింది. ఈ సర్వేలో 1500 మంది పాల్గొన్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+