ఐటీ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. ఇంజనీరింగ్ టెక్నాలజీ దిగ్గజం హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ ... 2020 లో భారీ స్థాయిలో ఉద్యోగాలు ఉవ్వబోతోంది. ముఖ్యంగా ఎక్కువ మంది ఫ్రెషర్స్ ను రిక్రూట్ చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. గతేడాదితో పోల్చితే రెట్టింపు సంఖ్యలో కొలువులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారు, లేదా చివరి సెమిస్టరు ఎగ్జామ్స్ రాస్తున్నవారికి ఇదొక వరమని చెప్పాలి. దేశంలో ఆర్థిక మందగమనం అలుముకుంటున్న సమయంలో ఉన్న ఉద్యోగాలే ఊడుతున్నాయి. అలాంటి సమయంలో వేలకొద్దీ కొత్త ఉద్యోగాలు రావటం, అది కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కొలువు దొరకటం నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది. హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ మరో తీపి కబురును కూడా అభ్యర్థులకు పంచబోతోంది. అదేమిటంటే.... గతంలో కంటే మెరుగైన ప్యాకేజీలను ఆఫర్ చేయబోతోంది. ఈ ఏడాది నుంచి దీనిని అమలు చేయబోతోంది. ఇంకెందుకు ఆలస్యం, ఒకవైపు జాబ్ ఆఫర్, మరో వైపు బెటర్ శాలరీ... వెంటనే అప్లై చేయండి మరి!

రెట్టింపు ఉద్యోగాలు...
ఇండియాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న హెచ్ సి ఎల్ టెక్నాలజీస్... 2020-21 ఆర్థిక సంవత్సరంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు ఇవ్వబోతోంది. గతేడాది ఈ సంఖ్య కేవలం 8,600 మాత్రమే కావటం గమనార్హం. అంటే, గతేడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు రెట్టింపు సంఖ్యలో ఫ్రెషర్స్ ను అపాయింట్ చేసుకుంటోంది. అటు ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, మానేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వనుంది. మొత్తం 15,000 ఫ్రెషర్స్ లో ఒక 500 మందిని టాప్ బిజినెస్ స్కూల్స్ నుంచి హైర్ చేసుకోనుంది. వీరందరికీ మెరుగైన వేతనాలు అందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది.

రూ 3.8 లక్షల వేతనం...
ఫ్రెషర్స్ కు ఇచ్చే వేతన ప్యాకేజీలు కూడా పెరగబోతున్నాయి. ఈ ఏడాది నుంచి ఫ్రెషర్స్ కు 15-20% అధిక వేతనాలను ఆఫర్ చేస్తామని హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ వీ వీ అప్పారావు వెల్లడించారు. దీంతో ప్రతి ఇంజనీరింగ్ అభ్యర్థికి కనీసం రూ 3.6 లక్షల నుంచి రూ 3.8 లక్షల వేతనం లభిస్తుంది. అదే సమయంలో ఇండియా లోని టాప్ బిజినెస్ అండ్ మానేజ్మెంట్ స్కూల్స్ నుంచి వచ్చే వారికి మరింత ఆకర్షణీయమైన ప్యాకేజీలు అందుతున్నాయి. ఐ ఐ ఎం - అహ్మదాబాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ ఎస్ బి), ఐఐఎం బెంగుళూరు, ఐఐఎం కోల్కతా, ఎస్ పీ జైన్, ఎక్స్ ఎల్ ఆర్ ఐ వంటి సంస్థల్లో చదివిన వాటికి రూ 20 లక్షల నుంచి రూ 23 లక్షల వార్షిక ప్యాకేజీ లభిస్తోంది. ఐఐఎం ఇండోర్, లక్నో, కోజిఖోడ్ కాలేజీల విద్యార్థులకు రూ 15 లక్షల నుంచి రూ 18 లక్షల వేతనం ఆఫర్ చేస్తున్నారు. ఇక మిగిలిన మానేజ్మెంట్ కాలేజీల విద్యార్థులకు రూ 4.5 లక్షల నుంచి రూ 7 లక్షల వరకు వేతనం అందనుంది. ఇదిలా ఉండగా, ఐ ఐ టీ విద్యార్థులకు రూ 12 లక్షల నుంచి రూ 15 లక్షల వేతనం, ఎన్ ఐ టీ విద్యార్థులకు రూ 8 లక్షల నుంచి రూ 12 లక్షల శాలరీ నిర్ణయించారు.

అమెరికా లోనూ దూకుడే...
ఇండియా తో పాటు అమెరికా లో కూడా హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ పెద్ద ఎత్తున క్యాంపస్ హైరింగ్ చేపట్టనుంది. గతేడాది సుమారు 3,000 మంది అమెరికన్ ఫ్రెషర్స్ ను హైర్ చేసుకున్న కంపెనీ... ఈ ఏడాది మరో 10-15% అధిక సంఖ్యలో ఆఫర్స్ ఇవ్వబోతోంది. ప్రస్తుతం అమెరికాలో హెచ్ సి ఎల్ కు సుమారు 20,000 ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 67% మంది అమెరికన్లే కావటం విశేషం. పెరుగున్న డిమాండ్ కు అనుగుణంగా అధిక సంఖ్యలో ఉద్యోగులను నియమిస్తున్నామని, ఆ మేరకు తమకు భారీ స్థాయిలో ప్రాజెక్టులు పైప్లైన్ లో ఉన్నాయని అప్పారావు వెల్లడించారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications