20 ఏళ్లలో తొలిసారి.. ప్రత్యక్ష పన్ను వసూళ్లు భారీగా తగ్గవచ్చు

ఢిల్లీ: మందగమనం నుంచి బయటపడేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దీపనలు ప్రకటించింది. కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. డిమాండ్ - వినిమయం తగ్గిన నేపథ్యంలో ప్రజల చేతుల్లో డబ్బులు ఉంచేలా బడ్జెట్‌లో ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో మోడీ ప్రభుత్వానికి చేదువార్త.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల రాబడిలో కోతపడే అవకాశాలు ఉన్నాయి. ఈసారి కార్పోరేట్ పన్ను, ఆదాయపు పన్ను వసూళ్లు తగ్గే అవకాశముందని సీనియర్ పన్ను అధికారులు అంటున్నారు. ఆర్థిక మందగమనం, కార్పోరేట్ ట్యాక్స్‌లో కోతకు ఇందుకు కారణమని అంటున్నారు.

Government Faces First Fall In Direct Taxes In At Least Two Decades: Report

మందగమనం నేపథ్యంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లపై తీవ్ర ప్రభావం తప్పదని అంటున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల ద్వారా రూ.13.5 లక్షల కోట్ల వసూలు కావచ్చని మోడీ ప్రభుత్వ బడ్జెట్‌లో అంచనా వేసింది. 2018-19లో నమోదైన రూ.11.5 లక్షల కోట్ల వసూళ్లతో పోలిస్తే 17% అధికంగా రాబట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం కంటే 10% వరకు తగ్గే ప్రమాదం ఉందని అధికార వర్గాల మాట. ఈసారి వసూళ్లు రూ.10 లక్షల కోట్లకు పరిమితమయ్యే అవకాశముంది.

బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే రూ.3 లక్షల కోట్ల వరకు తగ్గొచ్చు. గత ఇరవై ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు అంతకుముందు సంవత్సరం కంటే తగ్గిన సందర్భాలు లేవు. కానీ ఇప్పుడు మందగమనం నేపథ్యంలో ఈ సంవత్సరం గడ్డు పరిస్థితులు తప్పవని అధికారులు అంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+