రూ.51,000 సమీపానికి బంగారం ధర, రూ.700కు పైగా వెండి జంప్
దేశీయ, అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్లో పసిడి, వెండి ధరలు పెరిగాయి. ఉదయం ఓ సమయంలో స్వల్పంగా తగ్గిన బంగారం సాయంత్రం సమయానికి పెరిగింది. గతవారం దాదాపు స్థిరంగా ఉన్న ధరలు నేడు మళ్లీ పెరిగాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56,200తో ఇప్పటికీ రూ.5,200 తక్కువ పలుకుతోంది. నేడు (నవంబర్ 2) దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.255 (0.50 శాతం) పెరిగి రూ.50,954 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం రూ.50,777 వద్ద ప్రారంభమైన ధర, రూ.51,000 వద్ద గరిష్టాన్ని, రూ.50,612 వద్ద కనిష్టాన్ని తాకింది.
రూ.250కి పైగా పెరిగిన పసిడి
డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ.255 పెరగగా, ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.281 (0.55 శాతం) పెరిగి రూ.51,085 పలికింది. గతవారం రూ51,000 దిగువకు వచ్చిన పసిడి ఇప్పుడు ఈ మార్క్ను దాటింది. రూ.50,781.00 ప్రారంభం కాగా, రూ.51,100.00 గరిష్టాన్ని, రూ.50,740.00 కనిష్టాన్ని తాకింది. ఆగస్ట్ 7న పసిడి ధరలు రూ.56,200ను తాకిన విషయం తెలిసిందే. ఈ ఏఢాది పసిడి ధరలు 30 శాతం వరకు పెరిగాయి.
వెండి ధరలదీ అదే దారి
వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.706(1.16 శాతం) పెరిగి రూ.61,571 పలికింది. రూ.61,422.00 ప్రారంభం కాగా, రూ.62,272.00 వద్ద గరిష్టాన్ని, రూ.61,330.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
మార్చి ఫ్యూచర్స్ కిలో రూ.571 (0.91 శాతం) పెరిగి రూ.63,015 పలికింది. రూ.63,187.00 వద్ద ప్రారంభమై, రూ.63,818.00 వద్ద గరిష్టాన్న, రూ.62,914.00 వద్ద కనిష్టాన్ని తాకింది.
అక్కడా పెరిగిన బంగారం, వెండి
అంతర్జాతీయ మార్కెట్లోను పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ 0.82 శాతం పెరిగి 1,895.35 డాలర్లు వద్ద ట్రేడ్ అయింది. 1,873.55 - 1,896.05 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. పసిడి ఈ ఏడాది 21.83 శాతం పెరిగింది. వెండి ధర ఔన్స్ 1.32 శాతం పెరిగి 23.957 డాలర్లు పలికింది. 23.462 - 24.253 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. వెండి ఏడాదిలో 28.82 శాతం పెరిగింది.