2019లో బంగారం ధర ఎంతగా పెరిగిందంటే? నేడు స్థిరంగా ధరలు...
అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం కారణంగా సోమవారం (డిసెంబర్ 23) బంగారం ధరలు పెరిగాయి. ఎంసీఎక్స్లో 10గ్రాముల ఫ్యూచర్స్ ఫిబ్రవరి 0.29 శాతం లేదా రూ.110 పెరిగి రూ.38,101కి చేరుకుంది. ఫ్యూచర్ మార్చ్ రూ.45,129 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది రూ.225 లేదా 0.5 శాతం పెరిగింది.
బంగారంపై రుణం తీసుకుంటున్నారా? అయితే ఈ పొరపాటు చేయకండి!
ఆ ఒప్పందం తర్వాత బంగారంపై ప్రభావం
అమెరికా - చైనా మధ్య తొలి ఒప్పందం జరగడంతో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నాయి. అంతకుముందు గత 17 నెలలుగా ఈ అగ్రదేశాల ఒప్పందం సస్పెన్స్ కారణంగా మార్కెట్లు ఒడిదుడుకులను చవిచూశాయి. అప్పటి వరకు పూర్తి కన్ఫ్యూజన్లో ఉన్న పెట్టుబడిదారులకు ఓ క్లారిటీ వచ్చింది. దీంతో రిస్కర్ అసెట్స్పై అప్పటి వరకు వేచి చూసిన వారు ఆ దిశగా మరలారు. దీంతో బంగారంపై లాభాలు కాస్త తగ్గిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్థిరంగా...
అమెరికా - చైనా తదుపరి వాణిజ్య ఒప్పందంపై అంతర్జాతీయ ఇన్వెస్టర్లు దృష్టి సారించడంతో సోమవారం బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు స్థిరంగా ఉన్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 0.1 శాతం పెరిగి 1,479.05 డాలర్లుగా ఉంది.
20 శాతం పెరిగిన బంగారం ధర
2019 క్యాలెండర్ ఇయర్లో బంగారం ధర ఏకంగా 20 శాతం వరకు పెరిగింది. ప్రస్తుతం ఇది సెప్టెంబర్ నెలలోని గరిష్ట రికార్డ్ స్థాయి రూ.40,000తో పోల్చుకుంటే రూ.2,000 కంటే తక్కువగానే ఉంది. అయినప్పటికీ ఈ ఏడాది బంగారం ధర భారీగానే పెరిగింది.