ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ స్టోర్ల సంస్థ వాల్మార్ట్ కు ఇండియాలో చుక్కెదురైంది. ఇటీవల వాల్మార్ట్ ఇండియా కొంత మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది ఉద్యోగులు కంపెనీ చర్యను తప్పుబడుతూ మాతృ సంస్థ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తమ తొలగింపు అన్యాయమని, అది పనితీరును ఆధారంగా చేసుకుని జరిగింది కాదని ఇటీవల ఉద్వాసనకు గురైన కొంత మంది ఉద్యోగులు వాల్మార్ట్ ఇండియా పై తిరగబడ్డారు.
కంపెనీలో లే ఆఫ్స్ ఉండబోవని, ఇటీవలే (గత డిసెంబర్ నెలలో) హామీ ఇచ్చి, అంతలోనే ఉద్యోగంలోంచి తొలగించటం ఏంటని వారు ప్రశ్నించారు. తొలగింపునకు గురైన వారిలో సుమారు 40 మంది అమెరికా లోని బెంటెంవిల్లా లోని వాల్మార్ట్ హెడ్ క్వార్టర్కు విడివిడిగా లేఖలు రాశారు. అలాగే ఒక గ్రూపుగా చేరి సంయుక్తంగానూ ఫిర్యాదు చేసారు. వాల్మార్ట్ ఇండియా ఇటీవలి కాలంలో చేసుకున్న రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లోని లొసుగులను కూడా వారి ఫిర్యాదుల్లో వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

త్వరలోనే విచారణ....
ఇటీవల ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ లో వాల్మార్ట్ ఇండియా 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు. అది జనవరి 13న ప్రచురితమైంది. ఆ మరుసటి రోజే మరో 56 మందిని కూడా ఉద్యోగం వీడాలని కంపెనీ ఆదేశాలు వచ్చాయని సమాచారం. అయితే, తొలగింపునకు గురైన ఉద్యోగులు రాసిన ఉత్తరాలకు అమెరికా లోని వాల్మార్ట్ స్పందించినట్లు తెలిసింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు అమెరికా కంప్లియన్సు అండ్ ఎథిక్స్ డిపార్ట్మెంట్ కు చెందిన బృందం ఒకటి త్వరలోనే ఇండియాకు రానున్నట్లు వినికిడి. ఆ బృందం అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరపనున్నట్లు సమాచారం. అది జరిగితే అసలు విషయం బయటకు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇండియాలో విస్తరణకు స్వస్థి ...
ఇండియాలో కార్యకలాపాలు పెద్దగా లాభసాటిగా లేకపోవటంతో వాల్మార్ట్ ఇక్కడి కార్యకలాపాలన పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైలోని తన అతిపెద్ద ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ (వేర్ హౌస్) ను మూసివేసింది. అలాగే దేశంలో కొత్త స్టోర్ల విస్తరణ ను నిలిపివేసింది. రూ 1 లక్ష కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఫ్లిప్కార్ట్ తో బ్యాక్ ఎండ్ కార్యకలాపాలను అనుసంధానం చేస్తోంది. తద్వారా ఇండియాలో వ్యయాలను కట్టడి చేయాలనీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వాల్మార్ట్ ఇండియాలో ఉద్యోగులను కూడా తొలగిస్తోంది. ఫ్లిప్కార్ట్ తాజాగా ఫుడ్ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్న సమయంలోనే ఉద్యోగుల తొలగింపు జరుగుతుండటం గమనార్హం. ఫార్మర్ మార్ట్ పేరుతో ఫ్లిప్కార్ట్ త్వరలోనే స్థానికంగా పండించిన ఆహార పదార్థాలను ఆన్లైన్ లో విక్రయిచబోతోంది. ఆన్లైన్ తో పాటు స్టోర్ల నూ ఫుడ్ ఐటమ్స్ ను సేల్ చేయాలనీ ఫ్లిప్కార్ట్ భావిస్తున్నట్లు సమాచారం.

స్పందించిన కంపెనీ...
ప్రస్తుతం తొలగించిన ఉద్యోగుల అంశంపై వాల్మార్ట్ ఇండియా స్పందించింది. తమ కంపెనీ కంప్లియన్సు, కల్చర్, ఇంటెగ్రిటీ కు అనుగుణంగా పటిష్టమైన విధానాలు అమలు చేస్తామని తెలిపింది. ఎలాంటి ఆరోపణలు ఐనా తీవ్రంగానే పరిగణించి, అందుకు అనుగుణంగా వాటిని సమీక్షిస్తామని వెల్లడించింది. ఇండియాలో తాము వృద్ధి చెందేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ క్రమంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, స్థానిక ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తామని, అందులో భాగంగా స్థానిక చట్టాలను వారి ప్రయోజనం కలిగేలా అమలు చేయటానికి బద్ధులమై ఉంటామని పేర్కొంది. చూడాలి మరి ఇక ముందు వాల్మార్ట్ కార్యకలాపాలు ఇండియాలో ఎలా కొనసాగుతాయో, ఉద్యోగులతో నెలకొన్న వివాదం ఎప్పుడు సమిసిపోతుందో.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications