ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ స్టోర్ల సంస్థ వాల్మార్ట్ కు ఇండియాలో చుక్కెదురైంది. ఇటీవల వాల్మార్ట్ ఇండియా కొంత మంది ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది ఉద్యోగులు కంపెనీ చర్యను తప్పుబడుతూ మాతృ సంస్థ ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. తమ తొలగింపు అన్యాయమని, అది పనితీరును ఆధారంగా చేసుకుని జరిగింది కాదని ఇటీవల ఉద్వాసనకు గురైన కొంత మంది ఉద్యోగులు వాల్మార్ట్ ఇండియా పై తిరగబడ్డారు.
కంపెనీలో లే ఆఫ్స్ ఉండబోవని, ఇటీవలే (గత డిసెంబర్ నెలలో) హామీ ఇచ్చి, అంతలోనే ఉద్యోగంలోంచి తొలగించటం ఏంటని వారు ప్రశ్నించారు. తొలగింపునకు గురైన వారిలో సుమారు 40 మంది అమెరికా లోని బెంటెంవిల్లా లోని వాల్మార్ట్ హెడ్ క్వార్టర్కు విడివిడిగా లేఖలు రాశారు. అలాగే ఒక గ్రూపుగా చేరి సంయుక్తంగానూ ఫిర్యాదు చేసారు. వాల్మార్ట్ ఇండియా ఇటీవలి కాలంలో చేసుకున్న రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లోని లొసుగులను కూడా వారి ఫిర్యాదుల్లో వివరించినట్లు తెలిసింది. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది.

త్వరలోనే విచారణ....
ఇటీవల ఎకనామిక్ టైమ్స్ లో ప్రచురితమైన ఒక ఆర్టికల్ లో వాల్మార్ట్ ఇండియా 100 మంది ఉద్యోగులను తొలగించినట్లు పేర్కొన్నారు. అది జనవరి 13న ప్రచురితమైంది. ఆ మరుసటి రోజే మరో 56 మందిని కూడా ఉద్యోగం వీడాలని కంపెనీ ఆదేశాలు వచ్చాయని సమాచారం. అయితే, తొలగింపునకు గురైన ఉద్యోగులు రాసిన ఉత్తరాలకు అమెరికా లోని వాల్మార్ట్ స్పందించినట్లు తెలిసింది. ఈ అంశంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపేందుకు అమెరికా కంప్లియన్సు అండ్ ఎథిక్స్ డిపార్ట్మెంట్ కు చెందిన బృందం ఒకటి త్వరలోనే ఇండియాకు రానున్నట్లు వినికిడి. ఆ బృందం అన్ని విషయాలపై సమగ్ర విచారణ జరపనున్నట్లు సమాచారం. అది జరిగితే అసలు విషయం బయటకు తెలిసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.

ఇండియాలో విస్తరణకు స్వస్థి ...
ఇండియాలో కార్యకలాపాలు పెద్దగా లాభసాటిగా లేకపోవటంతో వాల్మార్ట్ ఇక్కడి కార్యకలాపాలన పునర్వ్యవస్థీకరిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ముంబైలోని తన అతిపెద్ద ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ (వేర్ హౌస్) ను మూసివేసింది. అలాగే దేశంలో కొత్త స్టోర్ల విస్తరణ ను నిలిపివేసింది. రూ 1 లక్ష కోట్లకు పైగా వెచ్చించి కొనుగోలు చేసిన ఫ్లిప్కార్ట్ తో బ్యాక్ ఎండ్ కార్యకలాపాలను అనుసంధానం చేస్తోంది. తద్వారా ఇండియాలో వ్యయాలను కట్టడి చేయాలనీ కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే వాల్మార్ట్ ఇండియాలో ఉద్యోగులను కూడా తొలగిస్తోంది. ఫ్లిప్కార్ట్ తాజాగా ఫుడ్ రంగంలోకి కూడా ప్రవేశిస్తున్న సమయంలోనే ఉద్యోగుల తొలగింపు జరుగుతుండటం గమనార్హం. ఫార్మర్ మార్ట్ పేరుతో ఫ్లిప్కార్ట్ త్వరలోనే స్థానికంగా పండించిన ఆహార పదార్థాలను ఆన్లైన్ లో విక్రయిచబోతోంది. ఆన్లైన్ తో పాటు స్టోర్ల నూ ఫుడ్ ఐటమ్స్ ను సేల్ చేయాలనీ ఫ్లిప్కార్ట్ భావిస్తున్నట్లు సమాచారం.

స్పందించిన కంపెనీ...
ప్రస్తుతం తొలగించిన ఉద్యోగుల అంశంపై వాల్మార్ట్ ఇండియా స్పందించింది. తమ కంపెనీ కంప్లియన్సు, కల్చర్, ఇంటెగ్రిటీ కు అనుగుణంగా పటిష్టమైన విధానాలు అమలు చేస్తామని తెలిపింది. ఎలాంటి ఆరోపణలు ఐనా తీవ్రంగానే పరిగణించి, అందుకు అనుగుణంగా వాటిని సమీక్షిస్తామని వెల్లడించింది. ఇండియాలో తాము వృద్ధి చెందేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఈ క్రమంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, స్థానిక ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలను అమలు చేస్తామని, అందులో భాగంగా స్థానిక చట్టాలను వారి ప్రయోజనం కలిగేలా అమలు చేయటానికి బద్ధులమై ఉంటామని పేర్కొంది. చూడాలి మరి ఇక ముందు వాల్మార్ట్ కార్యకలాపాలు ఇండియాలో ఎలా కొనసాగుతాయో, ఉద్యోగులతో నెలకొన్న వివాదం ఎప్పుడు సమిసిపోతుందో.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications