న్యూఢిల్లీ: ఆర్థికపరమైన నేరాలను అదుపు చేయడానికి ఏర్పాటైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. కొరడా ఝుళిపించింది. చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ కంపెనీ షావోమి ఇండియాకు చెందిన ఆస్తులను సీజ్ చేసింది. ఈ ఆస్తుల విలువ 5,551.27 కోట్ల రూపాయలు. ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు గుర్తించడం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఢిల్లీ-నేషనల్ కేపిటల్ రీజియన్ సహా ఇతర ప్రాంతాల్లో ఉన్న షావోమి కార్యాలయాలపై ఇదివరకే విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో షావోమి కార్యాలయాలపై ఈ దాడులు చేశారు. భారత్లో ప్రతి సంవత్సరం 34,000 కోట్ల రూపాయల విలువ చేసే వ్యాపార కార్యకలాపాలను షావోమి నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

2014 నుంచి భారత్లో షావోమి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. భారత కంపెనీలతో కుదుర్చుకున్న కాంట్రాక్టుల ప్రకారం.. మొబైల్ ఫోన్లు, విడి భాగాలు, ఇతర పరికరాలను ఇక్కడే తయారు చేయిస్తుందీ కంపెనీ. షావోమి మాతృదేశం చైనాతో వీటికి ఒప్పందం ఉంది. షావోమీ ఇండియాతో కాంట్రాక్ట్ కుదుర్చుకోలేదు. టెక్నాలజీ, సాఫ్ట్వేర్ సపోర్ట్ను షావోమి ఇండియా సమకూర్చదు. అయినప్పటికీ- మూడు విదేశీ సంస్థలకు షావోమీ ఇండియా భారీగా నగదును మళ్లించింది.
దీనికోసం తప్పుడు పత్రాలను ఆ కంపెనీ యాజమాన్యం సృష్టించింది. బ్యాంకులను సైతం తప్పుదోవ పట్టించింది. తప్పుడు సమాచారాన్ని అందజేసింది. దీన్ని ఫెమా ఉల్లంఘనగా గుర్తించారు అధికారులు. ఆ సంస్థ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మనుకుమార్ జైన్ను కూడా ఇటీవల ఈడీ విచారించింది కూడా. ఇప్పటికే వివిధ ఖాతాల నుంచి నగదును మళ్లించిన నేపథ్యంలో- షావోమి ఇండియా ఆ మిగిలిన మొత్తాన్ని కూడా అక్రమంగా చెల్లించే అవకాశం ఉందని ఈడీ అధికారులు భావించారు. ఈ కారణంతో 5,551 వేల కోట్ల రూపాయల నగదును సీజ్ చేశారు.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications