ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నివాస మార్కెట్లో భారత్ నుంచి మూడు నగరాలకు చోటు దక్కింది. దేశ రాజధాని ఢిల్లీ 9వ స్థానంలో, బెంగళూరు 20వ స్థానంలో, ముంబై 28వ స్థానంలో నిలిచాయి. ఈ మేరకు గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ 'ప్రైమ్ గ్లోబల్ సిటీ ఇండెక్స్' స్థానిక మార్కెట్లో రియాల్టీ ధరల ఆధారంగా ర్యాంకులను ఇస్తుంది.

తొలి స్థానంలో మాస్కో
2019 ఆర్థిక సంవత్సరం తాజా క్వార్టర్ రిపోర్ట్ ప్రకారం లగ్జరీ రెసిడెన్షియల్ మార్కెట్లో రష్యా రాజధాని మాస్కో తొలి స్థానంలో నిలిచింది. గత ఏడాది కాలంలో ఇక్కడ ఇళ్ల ధరలు 11.1% వృద్ధి చెందాయి. రెండోస్థానంలో 10.3% పెరుగుదలతో
ఫ్రాంక్ఫర్ట్, మూడో స్థానంలో 8.9%తో తైపీ నిలిచింది. ఈ జాబితాలో సియోల్కు చివరి స్థానం లభించింది. ఈ నగరంలో ఖరీదైన గృహాల ధరలు 12.9 శాతం పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 45 నగరాల్లో ఖరీదైన నివాస సముదాయాల ధరల కదలికలను స్థానిక కరెన్సీతో లెక్కగట్టి ఈ ర్యాంకులు ఇచ్చింది.

మన దేశంలో ఇలా...
ముంబై, ఢిల్లీ ర్యాంకులు పెంచుకున్నప్పటికీ గత మూడు నెలల్లో ఈ నగరాల్లో విలాసవంత గృహాల ధరలు స్థిరంగా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఎండీ చైర్మన్ శిశిరై బైజాల్ అన్నారు. మన దేశంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలు అఫర్టబుల్, మధ్యస్థాయి గృహాల అభివృద్ధికి పరిమితం అయ్యాయని, దీంతో లగ్జరీ ప్రాపర్టీ సంఘటిత కంపెనీలు, నిధులు సమృద్ధిగా ఉన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయని చెప్పారు.

ఢిల్లీ ఓ స్థానం మెరుగు
ఢిల్లీ గతంలో కంటే ఓ స్థానాన్ని మెరుగుపరుచుకొని 9వ స్థానానికి ఎగబాకింది. గ్రేటర్ కైలాశ్, వసంత్ విహార్, ఆనంద్ నికేతన్, డిఫెన్స్ కాలనీ, గ్రీన్ పార్క్ వంటి ప్రాంతాల్లో లగ్జరీ హౌస్ ధరలు మూడో త్రైమాసికంలో సగటున 4.4 శాతం పెరిగాయి. ఢిల్లీలో లగ్జరీ హౌస్ విలువ చదరపు అడుగుకు సగటున 4.4 శాతం పెరిగి రూ.33,511కు పెరిగింది.

బెంగళూరు, ముంబైలలో ఎంత అంటే?
బెంగళూరు గతంలో 15వ స్థానంలో ఉండగా ఇప్పుడు 20 స్థానానికి తగ్గింది. ముంబై గతంలో 30వ స్థానంలో ఉండగా రెండో స్థానాలు ఎగబాకి 28వ స్థానంలో నిలిచింది. బెంగళూరులో లగ్జరీ హౌస్ ధరల స్థల విలువ 2.1 శాతం వృద్ధితో రూ.19,709కి, ముంబైలో 0.8 శాతం పెరిగి రూ.64,775కు చేరుకుంది.

పెరుగుతున్న లగ్జరీ ఇళ్లు
ఇదిలా ఉండగా, ఇటీవలే ఏడు ముఖ్య నగరాల్లో రూ.1.5 కోట్లకు పైన వ్యాల్యూ కలిగిన లగ్జరీ సెగ్మెంట్ ఇళ్లను 16,100 యూనిట్లకు పైగా లాంచ్ చేశారు. ఇదే పీరియడ్లోని 2017 కంటే ప్రస్తుతం లగ్జరీ హౌసింగ్ సరఫరా మూడు రెట్లుగా ఉందని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనుజ్ పూరి అన్నారు. 2019 మొదటి అర్ధ సంవత్సరంలో ఢిల్లీ, ముంబైలలో ఎక్కువ లగ్జరీ యూనిట్ల సరఫరా ఉందని, ఇది 59 శాతం ఉందన్నారు. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాదులలో వరుసగా 2,210, 2070గా ఉందన్నారు.
More From GoodReturns

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..

Bengaluru: స్టార్టప్ పెట్టాలనుకుంటున్నారా? అయితే ఈ ఎంట్రప్రెన్యూర్ చెప్తున్న చేదు నిజాలు వినాల్సిందే!

బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..

Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

డబుల్ బెడ్ రూంకు నెలకు రూ. లక్ష అద్దె.. ముంబైలో హౌస్ రెంట్పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications