కరోనా సంక్షోభం పట్టి పీడిస్తున్న వేళ సాధారణ ప్రజలకూ తమ కష్టార్జితమైన ప్రతీ రూపాయీ విలువైనదే. గతంలో పరస్ధితి ఎలా ఉన్నా కరోనా వచ్చాక డబ్బు విలువ ప్రతీ ఒక్కరికీ తెలిసి వస్తోంది. ఇలాంటి సమయంలో మన బ్యాంకు ఖాతాలను కరోనా పేరుతో లూటీ చేసేందుకు సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగారన్న వార్తలు ఖాతాదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా సైబర్ టెక్నిక్స్ తో ఖాతాలు లూటీ కావడం ఖాయమంటున్నారు నిపుణులు...

కరోనా వేళ మీ ఖాతాలు భద్రంగా ఉన్నట్లేనా ?
కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆదాయాలు తగ్గిపోవడం, జీతాలు, వేతనాల్లో కోతలు, కొత్త ఆదాయ మార్గాలు మూసుకుపోవడం వంటి కారణాలతో సగటు ఉద్యోగులు, వేతన దారులు, ఖాతాదారులకు దిక్కుతోచని పరిస్దితి. ఇదే అదనుగా వీరిపై సైబర్ దాడులు చేసేందుకు నేరగాళ్లు సిద్దమైపోతున్నారు. వీరు ఎంచుకున్న కొత్త మార్గాలు చూస్తే కస్టమర్లు షాక్ తినడం ఖాయం. గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా సంక్షోభాన్ని వాడుకుంటూ వీరు ఖాతాలు దోచేస్తున్న తీరు సగటు మనిషికి అంతుబట్టడం లేదు.

కోవిడ్ 19 మెసేజ్ వచ్చిందా ?
కరోనా పై ప్రజల్లో అవగాహన తెప్పించేందుకు వీలుగా ప్రభుత్వాలు దేశ ప్రజలందరికీ విచ్చలవిడిగా కోవిడ్ 19 మెసేజ్ లు పంపుతున్నాయి. వీటి ప్రామాణికత ఎంత అనేది కాసేపు పక్కనబెడితే ఇవి సైబర్ నేరగాళ్లకు మాత్రం ఎంతో ఉపయోగపడుతున్నాయి. మెసేజ్ రాగానే అందులో ఏముందని వెతుకున్నే సగటు భారతీయుల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుంటూ వారి ఖాతాలకు చిల్లు పెడుతున్నారు. కరోనాపై అవగాహన, అలర్ట్ పేరుతో వస్తున్న మెసేజ్ లను నిజంగా అవగాహన అనుకుంటూ ఓపెన్ చేయగానే నేరుగా బ్యాంకు ఖాతాల వివరాలు సైబర్ నేరగాళ్లకు వెళ్లిపోతున్నాయి. వీటిని క్షణాల్లో ట్రేస్ చేసి అకౌంట్లను వారు ఖాళీ చేసేస్తున్నారు.

ఖాతాల్లో సొమ్ము దోచేస్తారిలా,,,
అచ్చుగుద్దినట్లుగా కోవిడ్ 19 పేరుతోనే మెసేజ్ లు పంపిస్తారు. సమగ్ర సమాచారం కోసం కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయాలని సూచిస్తారు. లింక్ ను టచ్ చేయగానే మన సెల్ ఫోన్ లోకి స్పైవేర్ వచ్చి చేరుతుంది. దాంతో వెంటనే ఫోన్ వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఫోన్ లోని బ్యాంకింగ్ యాప్ లు, బ్రౌజర్ ద్వారా ఖాతాల్లోకి లాగిన్ అయిపోయి క్షణాల్లోనే మన అకౌంట్లను కొల్లగొట్టేస్తారు. కళ్లు మూసి తెరిచేలోగా ఖాతా ఖాళీ అవుతుంది.

నిపుణుల హెచ్చరికలు..
కోవిడ్ 19 సమాచారం పేరుతో వచ్చే సందేశాలను ఒకటికి రెండుసార్లు చూసి నిర్ధారించుకున్న తర్వాత్ ఓపెన్ చేయాలి. లింక్ ఓపెన్ చేసిన తర్వాత కూడా ఇన్ స్టాల్ చేయడానికి అనుమతించవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఓసారి స్పైవేర్ ఇన్ స్టాల్ చేయడానికి అనుమతివ్వగానే మన సెల్ ఫోన్ లోని మెసేజ్ లతో పాటు సమగ్ర సమాచారం అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పోతుంది. అందుకే ఇలాంటి మేసేజ్ లు వచ్చినప్పుడు సాప్ట్వేర్ ఇన్ స్టాల్ చేయడానికి ఎట్టిపరిస్ధితుల్లోనూ అనుమతివ్వొద్దని వారు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications