ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లో ఇవ్వాళ మిశ్రమ ఫలితాలు కనపించాయి. లాభాలతో ఆరంభమైన మార్కెట్స్ సాయంత్రానికి పతనం అయ్యాయి. స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీ చెప్పుకోదగ్గ స్థాయిలో నష్టపోయాయి. సెన్సెక్స్లో ఉన్న షేర్లన్నీ రెడ్ జోన్లో కనిపించాయి. సిమెంట్ సెగ్మెంట్కు చెందిన షేర్లన్నీ ఇన్వెస్టర్లను ముంచాయి. ఐటీ, రియాల్టీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కేపిటల్ గూడ్స్, ఆటోమొబైల్స్.. ఇలా అన్నీ కీలకమైన బెంచ్మార్క్ ఇండైసెస్ అన్నీ నష్టపోయాయి. మైనస్లల్లో పడిపోయాయి.

48 పాయింట్ల లాస్..
ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 48 పాయింట్లు నష్టపోయింది. ట్రేడింగ్ 55,769.23 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ ఉదయం లాభపడ్డ 500కు పైగా పాయింట్లు.. సాయంత్రానికి తుడిచి పెట్టుకుపోయాయి. గరిష్ఠంగా 56,368 పాయింట్ల వద్ద నమోదైన ట్రేడింగ్.. సమయం గడుస్తున్న కొద్దీ నేల చూపులు చూసింది. 55,000ల కంటే దిగువకు పడిపోయింది. గురువారం నాటి క్లోజింగ్తో పోల్చుకుంటే 48 పాయింట్ల నష్టంతో 55,769.23 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ముగిసింది.

నిఫ్టీ అంతే..
నిఫ్టీ 50 కూడా అదే స్థాయిలో క్షీణించింది. 43.70 పాయింట్లను నష్టపోయింది. ఉదయం 100 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ ఆరంభమైనప్పటికీ.. అది ఎంతోసేపు స్థిరంగా నిలవలేదు. గరిష్ఠంగా 16,746.45 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అయింది నిఫ్టీ. అనంతరం దాని గ్రాఫ్ పడిపోయింది. రెడ్ జోన్లోకి వచ్చింది. గురువారం నాటి ముగింపు ట్రేడింగ్తో పోల్చుకుంటే 43.70 పాయింట్ల నష్టంతో 16,628 వద్ద ముగిసింది. మార్కెట్స్లో ఉదయం ఉన్న జోష్.. సాయంత్రానికి కనిపించలేదు. సెన్సెక్స్, నిఫ్టీ- నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లు ఉసూరుమన్నారు.

కొంత కోలుకున్నా..
చివరి రెండుగంటలో కోలుకున్నట్టే కనిపించింది. రికవరీ అవుతుందనుకున్న దశలో మళ్లీ కూలింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో సెన్సెక్స్ 56,091 పాయింట్ల నుంచి 56,216.61 పాయింట్ల వద్దకు ఎగబాకింది. ఎక్కువ సేపు అక్కడే స్థిరంగా నిలవలేకపోయింది. మళ్లీ క్రమంగా క్షీణించింది. చివరికి 55,769.23 పాయింట్ల వద్ద ఇవ్వాళ్టి ట్రేడింగ్ ముగిసింది.

అల్ట్రాటెక్ భారీ లాస్..
ఇవ్వాళ భారీగా నష్టపోయిన షేర్లల్లో సిమెంట్ రంగానికి చెందిన షేర్లు ఎక్కువగా కనిపించాయి. రామ్కో సిమెంట్స్-రూ.63.30 పైసలు, దాల్మియా భారత్-రూ.116.75 పైసలు, జేకే సిమెంట్ లిమిటెడ్-రూ.199.35 పైసలు, అల్ట్రాటెక్ సిమెంట్స్-రూ.330.25 పైసల మేర నష్టపోయాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్-రూ.రూ.93.05 పైసలు, బిర్లా కార్పొరేషన్-రూ.54.70 పైసలు, రేమాండ్ లిమిటెడ్-రూ.127.15 పైసల మేర నష్టాన్ని మిగిల్చాయి ఇన్వెస్టర్లకు.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

డబుల్ బెడ్ రూంకు నెలకు రూ. లక్ష అద్దె.. ముంబైలో హౌస్ రెంట్పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications