తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఎవర్ గ్రాండ్లో వాటా కొనుగోలు చేసేందుకు మరో బిలియనీర్ ముందుకు వచ్చారు. హాంగ్కాంగ్ లిస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ హాప్సన్ డెవలప్మెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. హాప్సన్ను చూ ఫ్యామిలీకి చెందిన సంస్థ. ఇటీవల ఎవర్ గ్రాండ్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక కష్టాల్లో ఉన్న ఎవర్ గ్రాండ్ సంస్థ రుణదాతలకు చెల్లింపుల కోసం తన ప్రాపర్టీ మేనేజ్మెంట్ వ్యాపారంలో మెజార్టీ వాటాను విక్రయించేందుకు ముందుకు వచ్చింది. ఎవర్ గ్రాండ్ ప్రాపర్టీ సర్వీసెస్ గ్రూప్లోని 51 శాతం వాటాను ఎవర్ గ్రాండ్ విక్రయించనుందని చైనా మీడియా తెలిపింది. చైనా ప్రభుత్వం మద్దతు కలిగిన హాప్సన్ ఈ వాటాను సొంతం చేసుకునేందుకు 5 బిలియన్ డాలర్లు చెల్లించనుందని తెలుస్తోంది. ఎవర్ గ్రాండ్, దాని బిలియనీర్ వ్యవస్థాపకుడు హుయ్-కా-యాన్ కోసం ఫైనాన్స్ చేస్తున్న మరో సంపన్న కుటుంబం ఛూ ఫ్యామిలీ అవుతుంది.
ఇదిలా ఉండగా, హాంగ్కాంగ్ స్టాక్ ఎక్స్చేంజీలో ఎవర్ గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ సోమవారం నిలిచింది. ఎవర్ గ్రాండ్ ప్రాపర్టీ గ్రూప్ షేర్ల ట్రేడింగ్ కూడా ఆగిపోయింది. కంపెనీ షేర్లకు సంబంధించిన అతిపెద్ద ట్రాన్సాక్షన్ ప్రకటన నేపథ్యంలో ట్రేడింగ్ నిలిపివేయాలని తాము కోరినట్లు కంపెనీ తెలిపింది. కానీ ట్రాన్సాక్షన్ ఏమిటనే అంశాన్ని వెల్లడించలేదు. అలాగే, హాప్సన్ కూడా ట్రేడింగ్ నిలిపివేయాలని హాంగ్కాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజీని కోరిందని సమాచారం. వాటా కొనుగోలు నిమిత్తమే దీనిని నిలిపివేసినట్లు తెలుస్తోంది.

చైనా అతిపెద్ద రియాల్టీ కంపెనీ ఎవర్ గ్రాండ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే 300 బిలియన్ డాలర్లను రుణదాతలకు ఆ కంపెనీ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం వీటిపై వడ్డీ చెల్లించలేని పరిస్థితి నెలకొంది. దీంతో గతవారం కంపెనీకి షేర్లను ఓ చైనా బ్యాంకులో తాకట్టు పెట్టి 1.5 బిలియన్ డాలర్ల రుణానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. బాండ్ కొనుగోలు చేసిన వారికి ఈ సొమ్ముతో వడ్డీ చెల్లించాలని భావిస్తోంది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్పై RBI కఠిన ఆంక్షలు..

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications