దేశంలో మందగమనం తాండవం చేస్తోంది. సరుకులు, ఉత్పత్తులు కొనే వాళ్ళు కరువై కంపెనీలు కుయ్యోమొర్రో అంటున్నాయి. నిత్యావసరాల మాట అటుంచితే బిస్కట్లు కొనే వారు కూడా ఒకటి పది సార్లు ఆలోచించే పరిస్థితి నెలకొంది. డిమాండ్ పెరుగుతోందన్న మాట ఎప్పుడు వినిపిస్తుందా అని కంపెనీలు చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టిన కంపెనీలు ఇప్పుడు డిమాండ్ లేక పోవడంతో తలపట్టుకుంటున్నాయి. చేసేది లేక ఖర్చులను తగ్గించుకోవడానికి ముందు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఆ తర్వాత ఎక్కడ కోత పెట్టాలో చూస్తున్నాయి.
ముఖ్యంగా దేశీయ ఆటో ఆటోమొబైల్ రంగం పరిస్థితి మరీ దీనంగా తయారయిపోయింది. ఏం తక్కువ ఏడాది కాలంగా కంపెనీల అమ్మకాలు తగ్గుతుండటంతో మందగమన పరిస్థితి ఎలా ఉందో బోధపడుతోంది. అమ్మకాలను పెంచుకోవడానికి కంపెనీలు చేయని ప్రయత్నమంటూ లేదు. భారీగా డిస్కౌంట్లు, ఆఫర్లు, క్యాష్ బ్యాక్ లు ఇస్తున్నప్పటికీ కస్టమర్లు మాత్రం వాహనాలను కొనుగోలు చేసే విషయంలో పక్కాగా ఉంటున్నారు. తప్పదు అనుకుంటే తప్ప వాహనాల జోలికి వెళ్లడం లేదు. అందుకే అమ్మకాలు అంతంత మాత్రంగా ఉన్నాయి.

వస్తోంది.. గ్రేట్ వాల్ మోటార్స్
చైనాలో అతిపెద్ద ఎస్ యువీ ల తయారీ కంపెనీ ఇది. ఈ కంపెనీకి భారత మార్కెట్ పై కన్ను పడింది. ఇక్కడి మార్కెట్లోకి ప్రవేశించే ప్రయత్నంలో భాగంగా తన భారత అనుబంద సంస్థ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. దేశీయ మార్కెట్లో దాదాపు 7,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనతో ఈ కంపెనీ ఉంది. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ ప్రణాళికలు వెల్లడించాలని కంపెనీ ఉన్నతాధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ సమావేశం తర్వాత కంపెనీ భవిష్యత్ వ్యూహాలు ఏమిటన్నది తెలిసే అవకాశం ఉంటుంది.

5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్
గ్రేట్ వాల్ కంపెనీ తన వాహనాలను తయారు చేయడానికి అనువైన ప్రాంతాన్ని పరిశీలించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ ఆటోమొబైల్ రంగ కంపెనీలు ఉన్న ప్రాంతాలను కంపెనీ వర్గాలు చూస్తున్నట్టు సమాచారం. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఆటో మొబైల్ కంపెనీలు తమ యూనిట్లను కలిగి ఉన్నాయి. కాగా ఇప్పటికే కొన్ని కంపెనీలకు ఉన్న యూనిట్లను కూడా ఈ కంపెనీ పరిశిలీస్తున్నట్టు సమాచారం.

పెరగనున్న పోటీ..
ఇప్పటికీ దేశీయ కార్ల మార్కెట్లో పోటీ తీవ్ర స్థాయికి చేరుకుంది. మరో వైపు మందగమన ప్రభావం వల్ల వాహనాల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. బీఎస్ 6 నిభందనలు, ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలని ప్రభుత్వం ఒత్తిడి చేయడం వల్ల కంపెనీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.
* మారుతీ, హ్యుండై, మహీంద్రా, టాటా మోటార్స్, రెనో, హోండా, టొయోట, ఆడీ, బీఎండబ్య్లు, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఫోర్డ్ , ఫియట్ వంటి కార్ల కంపెనీలతో దేశీయ మార్కెట్ పోటీవంతంగా తయారైంది.
* ఈ ఏడాదిలో కొత్తగా ఎంజీ మోటార్, కియా కంపెనీలు ఈ మార్కెట్లోకి ప్రవేశించి పోటీని మరింత తీవ్రం చేశాయి. ఈ కంపెనీల వాహనాలకు కస్టమర్ల నుంచి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో మరిన్ని కంపెనీలు కూడా భారత మార్కెట్ పై ఆసక్తి చూపుతున్నాయి. ఈ కంపెనీల్లో ఒకటే గ్రేట్ వాల్. అయితే ఈ కంపెనీ వచ్చిన తర్వాత పరిస్థితి ఏవిధంగా ఉంటుందో వేచి చూడాల్సింది.

కొత్త కంపెనీలు వస్తే మంచిదే...
కొత్త కంపెనీలు రావడం వల్ల వినూత్న టెక్నాలజీ, ఫీచర్లు కలిగిన వాహనాలు మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. కంపెనీల మధ్య పోటీ కారణంగా ధరలు కూడా అందుబాటులోనే ఉండటానికి ఆస్కారం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రభుత్వానికి రాబడులు కూడా పెరుగుతాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
More From GoodReturns

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications