ట్యాక్స్‌పేయర్స్‌కు 6 నెలల్లో రూ.1.01 లక్షల కోట్ల ఐటీ రీఫండ్స్

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఐటీ రీఫండ్స్ వేగవంతం చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 1వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ మధ్య 27.55 లక్షల మంది ట్యాక్స్‌పేయర్స్‌కు రూ.1.01 లక్షల కోట్లకు పైగా రీఫండ్స్ జారీ చేసింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ విభాగం వెల్లడించింది. ఇందులో 25,83,507 పన్ను చెల్లింపుదారులకు రూ.30,768 కట్ల వ్యక్తిగత ఆదాయపు పన్ను రీఫండ్స్, 1,71,155 పన్ను చెల్లింపుదారులకు .70,540 కోట్ల కార్పోరేట్ పన్ను రీఫండ్స్ చెల్లించినట్లు వెల్లడించింది.

కరోనా మహమ్మారి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను శాఖ 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను (AY 2019-20) ఐటీ రిటైర్న్స్ ఫైలింగ్ తేదీని జూలై 31వ తేదీ నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది. అలాగే, బ్యాంకులకు ప్రయోజనం చేకూరేలా ట్యాక్స్‌పేయర్స్‌కు చెందిన సమాచారాన్ని బ్యాంకులతో పంచుకోవచ్చునని సీబీడీటీ... ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సూచించింది.

CBDT issues refunds worth Rs 1.01 lakh crore to 27.55 lakh taxpayers

కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాలు కుప్పకూలాయి. జనాల చేతుల్లో డబ్బులు ఉండేలా కేంద్రం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. రూ.21 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఇటీవల కీలక రంగాలు కాస్త కోలుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. కీలకరంగాల మందగమనం జూలైలో తగ్గినట్లు అసోచాం ఇటీవల తెలిపింది. దీని ప్రకారం 2020 జూలైలో సిమెంట్, ఉక్కు, బొగ్గు వంటి ముఖ్య రంగాలు గణనీయమైన మెరుగుదల సాధించాయి. వాటి గణాంకాలు వార్షిక ప్రాతిపదికన క్షీణతను చూపించినప్పటికీ, అవివేగంగా మెరుగుపడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+