Budget 2022: ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడున్న ఆదాయపు పన్ను స్ట్రక్చర్ పైన 65 శాతం మంది ట్యాక్స్పేయర్స్ అసంతృప్తితో ఉన్నారని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు యు-గవ్ సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రస్తుత ఆదాయం పన్ను పరిమితులు పెంచాలని స్పష్టం చేశారు. తద్వారా వేతన జీవులపై పన్ను భారం తగ్గించాలన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఈ సందర్భంగా ఆదాయపు పన్నుకు సంబంధించి ఊరట ప్రకటనలు వస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో యు-గవ్ సర్వే నిర్వహించింది.

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి
దేశ ఆర్థిక అభివృద్ధికి ఆదాయపు పన్ను చాలా ముఖ్యమని 74 శాతం మంది వెల్లడించారు. అయితే 38 శాతం మంది మాత్రం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను మినహాయింపును రూ.5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి పదిమందిలో ముగ్గురు ప్రస్తుత రూ.1.5 లక్షల పన్ను రాయితీ పెంచాలని కోరారు. 32 శాతం మంది వేతనజీవులకు కల్పిస్తున్న రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.75వేలు లేదా రూ.1 లక్షకు పెంచాలని కోరుతున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలని కోరుతున్న వారిలో 40 ఏళ్లకు పైన ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు.

వైద్య ఖర్చులు, ఇంటి రుణంపై వడ్డీ
కరోనా నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరిగాయని, ఈ నేపథ్యంలో సెక్షన్80డీ పరిధఇలోని వైద్య ఖర్చుల పరిమితిని పెంచాలని మూడింట ఒకవంతు మంది చెప్పారు. 35 శాతం మంది వైద్య ఖర్చుల పరిమితిని పెంచాలని కోరారు.
అలాగే, హౌసింగ్ లోన్ వడ్డీ పైన పన్ను రాయితీని పెంచాలని కోరారు. 80 శాతం మంది పన్ను చెల్లింపు సబబు అని చెప్పగా, 25 శాతం మంది 10 శాతం చెల్లించవచ్చునని చెబుతున్నారు. అందరి పైన పన్ను విధించాలని 35 శాతం మంది అభిప్రాయపడ్డారు.

బడ్జెట్ పైన ప్రభావం
వ్యాపారులు, సంపన్నుల్లో 51 శాతం మంది మిగతా వారికంటే ఎక్కువ పన్ను చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 1.5 కోట్ల మంది, భారత్లో 1022 మంది అభిప్రాయాలను సేకరించింది. 47 శాతం మంది పట్టణవాసులు ప్రతియేటా బడ్జెట్ను అనుసరిస్తామని, 27 శాతం మంది కొన్నిసార్లు అనుసరిస్తామన్నారు. మధ్య తరగతిలో 67 శాతం మంది ప్రజలు తమ పర్సనల్ ఫైనాన్స్ పైన బడ్జెట్ ప్రభావం ఉంటుందన్నారు. పేదలు, సంపన్నులు మాత్రం ప్రభావం ఉండదన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications