న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థికమందగమనం నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశ పెడుతున్న బడ్జెట్లో కీలక ప్రకటనలు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు. బడ్జెట్లో ఉద్యోగులకు పలు వరాలను ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఇందులో భాగంగా రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను పరిమితిని 5 శాతానికే ప్రతిపాదించేందుకు ఆర్థికమంత్రి నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం సాగుతోంది.

ఆదాయపు పన్ను సడలింపుపై పరిశీలన
2024-25 ఆర్థిక సంవత్సరానికి భారత్ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా నిర్మించాలని మోడీ ప్రభుత్వం భావిస్తోంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించింది. మందగమనం నేపథ్యంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ఆదాయపు పన్ను ఊరట కూడా ఇస్తే బాగుంటుందనేదే వాదన ఉంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను సడలింపుపై ప్రభుత్వం సలహాలను పరిశీలిస్తున్నట్లు ఇటీవల ఆర్థికమంత్రి చెప్పారు.

గత రెండేళ్లలో..
మోడీ ప్రభుత్వం గత రెండేళ్లలో ఆదాయపు పన్ను ఊరటలు ఇచ్చింది. 2018లో స్టాండర్డ్ డిడక్షన్ (రూ.40,000) తిరిగి ప్రవేశ పెట్టింది. 2019లో ఈ పరిమితిని రూ.50,000కు పెంచింది. 2019 బడ్జెట్లో రూ.5 లక్షల ఆదాయం వరకు పన్నురహితంగా ఉండేందుకు మార్గం సుగమం చేసింది. రెండో ఇంటిపై వెసులుబాటు కల్పించింది. ప్రస్తుత మందగమనం నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో మరింత ఊరట ఉంటుందని భావిస్తున్నారు. కొత్త స్లాబ్స్ తీసుకు వస్తారని లేదా రూ.7 లక్షల వరకు ఆదాయంపై ఊరట ఉంటుందని భావిస్తున్నారు.

రూ.7 లక్షల వరకు 5 శాతం
ప్రస్తుతం రూ.2.5 లక్షల ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపు పన్ను లేదు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు 5 శాతం ఉంది. దీనిని రూ.7 లక్షలకు చేస్తారని అంచనా. అంటే రూ.7 లక్షల ఆదాయం వరకు 5 శాతం స్లాబ్లోకి వస్తుంది. బడ్జెట్లో ఈ ఊరట కలిగిస్తే ఎంతోమంది వేతనజీవులకు ఊరట.

స్లాబ్స్ సవరణ
చాలా ఏళ్ళుగా స్లాబ్స్లలో సవరణ లేదు. పన్ను పరిమితులను కూడా పెంచలేదు. రిబెట్లు, మినహాయింపులు మాత్రమే ఇచ్చారు. ఈసారి రిబేట్ లాంటి ప్రత్యామ్నాయాలను కాకుండా నేరుగా పన్ను స్లాబ్స్లలో మార్పులు చేస్తే బాగుంటుందనేది ఆర్థిక నిపుణుల సూచన. పన్నులను 5, 10, 20, 30, 35 శాతం స్లాబ్స్గా తీసుకు రావాల్సి ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం 5 శాతం, 20 శాతం, 30 శాతం స్లాబ్స్ ఉన్నాయి. ఆదాయాన్ని ఐదు స్లాబ్స్గా విభజిస్తే చాలామందికి ప్రయోజనంగా ఉంటుందని అంటున్నారు.

మిగులు..
రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారికి ప్రస్తుతం 20 శాతం ఉండగా, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయం కలిగిన వారికి 10 శాతం పన్ను ఉండవచ్చునని అంచనా. రూ.10 లక్షల నుంచి ఆ పైన ఆర్జించే వారికి కూడా స్లాబుల్లో మార్పులు ఉండాలని భావిస్తున్నారు. రూ.10 లక్షల లోపు ఆదాయం ఆర్జించే వారికి ప్రతి సంవత్సరం కనీసం రూ.60,000 వరకు పన్ను తగ్గుతుంది. రూ.15 లక్షల ఆదాయం ఉంటే రూ.1.10 లక్షలు, రూ.20 లక్షల ఆదాయం ఉంటే రూ.1.60 లక్షల పన్ను మిగులుతుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications