కరోనాపై పోరు నిమిత్తం ఖర్చు కోసం, లాక్ డౌన్ నేపథ్యంలో అంతటా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోవడంతో 2020-21 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో రాష్ట్రాల SDL(స్టేట్ డెవలప్మెంట్ లోన్స్) రూ.1.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. మార్చి ఇరవై ఐదో తేదీ నుండి లాక్ డౌన్ను పలుమార్లు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ కలెక్షన్స్ పడిపోయాయి. అలాగే కేంద్రం ఇచ్చిన వాటాతో పాటు కరోనా కోసం పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టవలసి వచ్చింది. దీంతో ఖర్చులు, ఆదాయం మధ్య అంతరం పెరిగింది.
దీంతో మొదటి క్వార్టర్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఎస్డీఎల్ భారీగా పెరిగి రూ.0.8 ట్రిలియన్ (2019-20 ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్) నుండి రూ.1.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఏడాది ప్రాతిపదికన 31.5 శాతం పెరుగుదల. రుణాల పెరుగుదల రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయానికి భారీ షాక్ అని చెప్పవచ్చు. లాక్ డౌన్ కాలంలో నిత్యావసర, అత్యవసర వస్తువులు మాత్రమే కొనుగోలు చేశారు. దీంతో అవసరం లేని వస్తువుల వినియోగం తగ్గాయి.

ఎస్డీఎల్ లోన్స్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో రూ.1.4 ట్రిలియన్కు చేరుకుంటాయని తొలుత అంచనా వేసింది. జూన్ 8వ తేదీ నుండి వరుసగా లాక్ డౌన్ ఎత్తివేసినప్పటికీ కరోనా వ్యాప్తి నివారణకు కొన్నిచోట్ల అవే నిబంధనలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్ని రాష్ట్రాలలో జూన్ నెలలోను ఇదే పరిస్థితి ఉండవచ్చునని భావిస్తోంది.
రాష్ట్రాల రుణాల విషయానికి వస్తే తమిళనాడు రూ. 28,000 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత మహారాష్ట్ర రూ.25,500 కోట్లు, రాజస్థాన్ రూ.16,000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ.15,000 కోట్లు, తెలంగాణ రూ.12,500 కోట్లు, కేరళ రూ.12,400 కోట్లు, బెంగాల్ రూ.10,000 కోట్లు, హర్యానా రూ.9,000 కోట్లు, గుజరాత్ రూ.8,600 కోట్లు, కర్నాటక రూ.7,000 కోట్లుగా ఉంది. ఈ రాష్ట్రాల వాటానే 86.1 శాతంగా ఉంది. తెలంగాణ తొమ్మిది నెలల రుణ పరిమితిని కేవలం కరోనా సమయంలనే దాటిపోయింది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications