న్యూఢిల్లీ: పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోకుండా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కాపాడుతుందని నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ అన్నారు. గ్రామాల్లో వైద్యం అందిస్తున్న అత్యధికులకు తగిన అర్హతలు లేవని, అలాంటి వారిని గుర్తించి, శిక్షణ ఇవ్వడం మంచిదని అభిప్రాయపడ్డారు. మొబైల్ ఫోన్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. రోగి లక్షణాలను సెల్ ఫోన్ యాప్లో పొందుపరిచి, ఎలాంటి వైద్యం చేయాలనుకున్నది వీరు చెబితే, అది మంచిదా కాదా అని నిపుణుల అభిప్రాయం వెల్లడించేలా ఆధునిక వ్యవస్థ ఉండాలని చెప్పారు. మోడీతో భేటీ అద్భుతంగా జరిగిందని అభిజిత్ చెప్పగా, అభిజిత్తో భేటీ అద్భుతం అని మోడీ ట్వీట్ చేశారు.

మోడీ ఆలోచనలు వినూత్నం
మోడీతో భేటీ అయి బయటకు వచ్చాక అభిజిత్ మీడియాతో మాట్లాడుతూ... 'ఎన్డీయే పరిపాలనపై క్షేత్రస్థాయిలో కొందరిలో నెలకొన్న అపోహల్ని తొలగించాలంటే పరిపాలనకు సంబంధించి ప్రజల సలహాలు కూడా స్వీకరించాలని, అధికార వ్యవస్థని ప్రక్షాళన చేసి ప్రజలకు జవాబుదారీతనాన్ని పెంచాలని మోడీ చెప్పారని, భారత్ అభివృద్ధి కోసం మోడీ ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయని ప్రశంసించారు.

మోడీని కలవగానే జోకులు వేశారు..
ప్రధాని మోడీని తాను కలవగానే ఆయన జోకులు వేశారని అభిజిత్ బెనర్జీ అన్నారు. ముఖ్యంగా మీడియా గురించి ఛలోక్తులు విసిరారన్నారు. మోడీకి వ్యతిరేకంగా మీరేమైనా చెబుతారేమోనని బయట మీడియా కాచుకొని కూర్చుందని, మీ నుంచి అలాంటి వ్యాఖ్యలు రాబట్టాలని ప్రయత్నిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తనతో నవ్వుతూ చెప్పారన్నారు. మీడియా మిమ్మల్ని మోడీ వ్యతిరేక ప్రచారంలోకి లాగే ప్రయత్నం చేస్తోందా.. అందులో ఇరుక్కోకండి అని మోడీ తనతో చెప్పారని అభిజిత్ అన్నారు.

మీరు జాగ్రత్త..
మోడీ టీవీల ద్వారా అన్నింటిని చూస్తూ ఉంటారని, మీడియా ప్రతినిధులు ఏం చేస్తారో గమనిస్తూ ఉంటారని, మీడియా ఏం చేస్తుందో ఆయనకు బాగా తెలుసునని, మీరు (విలేకరులు) జాగ్రత్త అంటూ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి అభిజిత్ బెనర్జీ అన్నారు.
భారత్ గర్విస్తోంది...
అభిజిత్ బెనర్జీతో మంగళవారం ఆహ్లాదకరమైన వాతావరణంలో భేటీ జరిగిందని, వివిధ రంగాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిగాయని మోడీ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీతో సమావేశం అద్భుతం అని, మానవ సాధికారతపై ఆయనకు ఉన్న తపన స్పష్టంగా కనిపిస్తోందని, వివిధ అంశాలపై ఆలోచనలను పంచుకున్నామని, ఆయన సాధించిన విజయాలు చూసి భారత్ గర్విస్తోందన్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications