న్యూఢిల్లీ: ఐటీ రిటర్న్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జూలై 31. వివిధ ఇష్యూల కారణంగా దీనిని పొడిగించాలనే డిమాండ్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఐటీ రిటర్న్స్ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుంది. 2018-19ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు ఆగస్ట్ 31, 2019 వరకు గడువును పొడిగించింది.
ఐటీ రిటర్న్స్ విషయంలో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇది పెద్ద ఊరట కలిగించే విషయం. సాధారణంగా గత ఏడాదికి సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసేందుకు చివరి తేదీ జులై 31. ఇప్పుడు ఆ గడువును కేంద్రం నెల రోజులు పొడిగించింది. 'ఐటీ రిటర్న్స్ సమర్పణ గడువు తేదీని జులై 31, 2019 నుంచి ఆగస్ట్ 31, 2019 వరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) పెంచింది. వివిధ కేటగిరీలకు చెందిన పన్ను చెల్లింపుదారులు ఆ తేదీలోగా రిటర్న్స్ను దాఖలు చేయాల్సి ఉంటుంద'ని ఆర్థిక మంత్రిత్వశాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

తాజాగా పెంచిన గడువు ప్రకారం ఆగస్ట్ 31వ తేదీ వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫైన్ ఉంటుంది. డిసెంబర్ 31వ తేదీలోగా ఫైల్ చేస్తే రూ.5,000, ఆ తర్వాత మార్చి 31, 2020 వరకు ఫైల్ చేస్తే రూ.10,000 ఫైన్ చెల్లించాలి.
కాగా, ఉద్యోగులకు ఫాం 16 ఆలస్యం కావడం, వాటిలో తప్పులు గుర్తించి సవరించిన డాక్యుమెంట్స్ను కంపెనీల నుంచి తిరిగి పొందేందుకు మరింత సమయం అవసరమైనందున గడువు తేదీని పొడిగించే అవకాశాలు ఉన్నాయని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ మేరకు చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) సంఘాలు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ఆర్థిక శాఖ, CBDT సానుకూలంగా స్పందించవచ్చునని భావించారు. ఆ మేరకు నెల రోజులు గడువు పెంచారు. వేతనజీవులకు యాజమాన్యాలు జూలై 10వ తేదీలోపు ఫాం 16 ఇష్యూ చేయాలని డెడ్ లైన్ విధించారు. అలాగే ఉద్యోగులు తమ ఐటీ రిటర్న్స్ జూలై 31లోపు దాఖలు చేయాలి. అంటే గడువు 21 రోజులు మాత్రమే. తక్కువ సమయం ఉన్నందున పొడిగిస్తారని భావించారు.
పన్ను చెల్లింపుదారులకు వారి ఇన్కం టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తగిన సమయం ఇవ్వడానికి, రిటర్న్ ఫైలింగ్ తేదీని పొడిగించాలని డిమాండ్స్ వచ్చాయి. ఫారం 16 సవరించారని, కాబట్టి వేతనజీవులకు కాస్త సమయం ఇవ్వాలని, అప్పుడే వారు ఎర్రర్స్ సరిగ్గా చూసుకోగలరనే వాదనలు వినిపించాయి. యాజమాన్యం జారీ చేసిన ఫాం 16లో లోపాలు గుర్తించేందుకు ఉద్యోగులకు సమయం పడుతుందని, ఆ తర్వాత దానిని యాజమాన్యం దృష్టికి తీసుకు వెళ్లాలని, అప్పుడు యాజమాన్యం దానిని సరిచేసి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ తతంగానికి సమయం తీసుకుంటుందని, కాబట్టి ఈ కారణంతో కూడా తేదీని పొడిగించాలని ఎంతోమంది డిమాండ్ చేసారు. ఇప్పుడు కేంద్రం ఊరట కల్పించింది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications