2021 నాటికి భారత్ను క్యాష్లెస్ సొసైటీగా RBI చేయనుందా?
క్యాష్లెస్ సొసైటీ లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విజన్ డాక్యుమెంట్ తయారు చేసింది. సురక్షఖితమైన, అందరికి అందుబాటులో ఉండేలా, సరసమైన ఈ-పేమెంట్స్ సిస్టం లక్ష్యంగా ఈ డాక్యుమెంట్ తయారు చేసింది. డిజిటల్ పేమెంట్స్ ఛార్జీలు విషయంలో కనీస జోక్యం ఉండేలని ప్రపోజ్ చేసింది. పేమెంట్ సిస్టం ప్రైస్ అట్రాక్టివ్ ఆపరేషన్స్ సహా అన్నింటిలోను ఇదే విధంగా ఉండనుంది.
పెరిగిన ఆవిష్కరణలు, డిజిటల్ పేమెంట్స్ వైపు చాలామంది మొగ్గు చూపుతుండటం వల్ల మరింత డిజిటలైజేషన్, అదే సమయంలో క్యాష్ లెస్ భారత్ చూడనున్నట్లు సెంట్రల్ బ్యాంక్ భావిస్తోంది. 2019-2021 మధ్య క్యాష్ లెస్ దిశగా ముందుకు సాగనుందని ఈ డాక్యుమెంట్లో అభిప్రాయపడింది. దీనికి 'పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా: విజన్ 2019-2021'గా నామకరణం చేసింది.
2018 డిసెంబర్ నెలలో 2,069 కోట్ల ట్రాన్సాక్షన్స్ ఉండగా, 2021 నాటికి ఇది నాలుగు రెట్లు పెరిగి 8,707 కోట్లుగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. UPI, IMPS యావరేజ్ ఆన్యువల్ గ్రోత్ వంద శాతం ఉండనుందని పేర్కొంది. 2021 నాటికి నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్సుఫర్ (NEFT) 40 శాతం పెరగనుందని భావిస్తోంది. ఇప్పుడు బ్యాంకింగ్ సమయంలోనే కాకుండా, 24X7 ఫండ్ ట్రాన్సుఫర్ ఫెసిలిటీని కల్పించనుంది. ఇది కూడా ఉపయోగపడుతుంది. 2021 నాటికి క్యాష్ లెస్ సొసైటీగా కాకపోయినప్పటికీ క్యాష్ వినియోగం బాగా తగ్గి, డిజిటల్ వినియోగం బాగా పెరగనుంది.