కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 'న్యాయ్' స్కీంను తీసుకు వస్తుందని, ఇది ఆర్థిక వృద్దికి ఉపయోగపడుతుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. నిరుపేదలకు కనీస ఆదాయం పథకమే న్యాయ్ స్కీం. పేదల ఉన్నతికి వ్యతిరేకంగా ఉన్నవారే న్యాయ్ స్కీంను వ్యతిరేకిస్తారన్నారు. దేశంలో 20 శాతం మంది నిరుపేదలు ఉన్నారని, వారికి జీడీపీలో 1.5 శాతం కేటాయించడం సరైనదే అన్నారు. న్యాయ్ స్కీం వల్ల మధ్యతరగతిపై ట్యాక్స్ పడుతుందనే వాదనను ఆయన కొట్టిపారేశారు. ఈ స్కీంను అమలు చేయడానికి మధ్యతరగతిపై ఎలాంటి భారం మోపబోమని చెప్పారు.

సంపద విస్తరణకు కట్టుబడి ఉన్నాం
సంపద సృష్టి, సంక్షేమ విస్తరణకు తాము కట్టుబడి ఉన్నామని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఆర్థిక రంగం విస్తరిస్తున్నకొద్దీ దాని ఫలాలు పేదలకు అందేలా చూడాలన్నారు. జీడీపీ ఇప్పుడున్న రూ.210 లక్షల కోట్ల నుంచి అయిదేళ్లలో రూ.400 లక్షల కోట్లకు చేరుతుందన్నారు. ఐదు కోట్ల పేద కుటుంబాలకు న్యాయ్ కింద సాయం అందించడానికి రూ.3.6 లక్షల కోట్లు చాలునని చెప్పారు. ఉపాధి హామీ పథకం మాదిరిగానే న్యాయ్ స్కీంను కూడా విజయవంతంగా అమలు చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక సమతుల్యత కొనసాగించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు.

నోట్ల రద్దుపై మన్మోహన్
నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణమని మన్మోహన్ అన్నారు. ఆర్థిక వ్యవస్థపై పూర్తి అవగాహన లేకపోవడం వల్లే నోట్ల రద్దు అన్నారు. దీంతో చిరు వ్యాపారులు ఆదాయాన్ని, మధ్య తరగతివారు తమ కష్టార్జితాన్ని కోల్పోయారని విమర్శించారు. మోడీ ప్రభుత్వానికి సరైన ఎకనామిక్ విజన్ లేదన్నారు. ప్రభుత్వం సరైన సంస్కరణలు చేపడితే వృద్ధి మరింత వేగవంతంగా ఉండేదని చెప్పారు. ప్రభుత్వానికి మంచి మెజార్టీ వచ్చిందని, దీంతో మంచి నిర్ణయాలు తీసుకొని, పేదరికాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

మేం ఏం చేస్తామంటే
2014 నాటికి రూ.2.51 లక్షల కోట్లుగా ఉన్న ఎన్పీఏలు 2018 డిసెంబర్ నాటికి రూ.10.36 లక్షల కోట్లకు ఎగబాకాయని చెప్పారు. మరో రూ.5.5 లక్షల కోట్ల మొండి బకాయిల్ని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది బ్యాంకుల్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టిందన్నారు. దీనిని సమీక్షించి, బ్యాంకుల బ్యాలెన్స్షీట్లను మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు. బ్యాంకులు, సెక్యూరిటీలు, ఆర్థిక మార్కెట్లలో కఠిన చర్యలను కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో వివరించిందన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications