రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్కు చట్టబద్దమైన భద్రత ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. తద్వారా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిని కాపాడాలని అభిప్రాయపడ్డారు. ఈ బ్యాంకు స్వతంత్రంగా పని చేయాలన్నారు.
ఆర్బీఐ గవర్నర్ విషయంలో చట్టబద్దమైన పరిమితులను లేదా చట్టబద్దమైన రక్షణ కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని రఘురాం రాజన్ తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ టర్మ్ను ప్రొటెక్ట్ చేయాల్సి ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవీకాలం ముగిసేంత వరకు ఎలాంటి ఒత్తిళ్లు పని చేయకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు. మార్పుకు సమయం ఆసన్నమైందన్నారు.

లోక్పాల్ వలె సెంట్రల్ బ్యాంకు గవర్నర్ పదవికి కూడా భద్రత ఉండాలని వ్యాఖ్యానించారు. ఆర్బీఐ పైన ప్రభుత్వం అధికారం పరిమితంగా ఉండాలని చెప్పారు. ఆర్బీఐపై ప్రభుత్వం అధికారం పరిమితంగా ఉండాలని తాను చెప్పానని, కానీ ఇందుకు రాజ్యాంగ సవరణలు అవసరం లేదని చెప్పరారు. ఇందుకు మనకు మనం క్రమశిక్షణ పాటించాలన్నారు.
కాగా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మినిమం ఇన్కం గ్యారెంటీ, ఉద్యోగాలు తదితర అంశాలపై కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
ఇటీవల రాహుల్ గాంధీ ప్రకటించిన కనీస ఆదాయ పథకం (మినిమమ్ ఇన్కం గ్యారెంటీ) పైన కూడా రఘురాం రాజన్ స్పందించారు. ఆయన తన పుస్తకంలో యూనివర్సల్ బేసిక్ ఇన్కం గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పథకంపై ప్రశ్నించగా, రాజన్ స్పందిస్తూ... సమర్థవంత లక్ష్యంతో ఈ పథకం ప్రారంభిస్తే అది నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఇతర పథకాలపై ప్రభావం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications