For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎన్నికలు: సోషల్ మీడియాకు ప్రకటనల ద్వారా రూ.12వేల కోట్లు, 87వేల వాట్సాప్ గ్రూప్‌లు

|

న్యూఢిల్లీ: ఏప్రిల్ 11వ తేదీన తొలిదశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 7 దశల్లో జరగనున్న ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన రానున్నాయి. నేతలు నేరుగా ప్రచార రంగంలోకి దిగడంతో పాటు సోషల్ మీడియాను కూడా విరివిగా ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సోషల్ మీడియా పైన రాజకీయ పార్టీలు రూ.12వేల కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేస్తున్నాయని అంచనా.

3,600,000,000,000: రాహుల్ గాంధీ మినిమం ఇన్‌కం గ్యారంటీకి ఏటా ఎంత ఖర్చు, ఎలా సాధ్యం?3,600,000,000,000: రాహుల్ గాంధీ మినిమం ఇన్‌కం గ్యారంటీకి ఏటా ఎంత ఖర్చు, ఎలా సాధ్యం?

ఇందులో ఫేస్‌బుక్‌ది సింహభాగం. కేవలం ఫేస్‌బుక్ రూ.10వేల కోట్లు ఆర్జించనుందని, మిగతా సోషల్ మీడియా మొత్తం రూ.2వేల కోట్లు ఆర్జించనుందని అంచనా. వాట్సాప్‌లో దాదాపు 87 వేల గ్రూపులు రాజకీయ ప్రచారంలో పాలుపంచుకొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

87,000 WhatsApp Groups May Target Voters With Political Messages: Report

ఒక గ్రూపులో 256 మందికి అవకాశముంటుంది. ఈ లెక్కన దాదాపు 2.2కోట్ల మంది వాట్సాప్‌ గ్రూపుల్లో ఉన్నట్లు లెక్క. భారత్‌లో 2017 నాటికి వాట్సాప్‌కు దాదాపు 20 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు భారత్‌లో 43 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. 2016 చివరి నాటికి 28 నుంచి 30 కోట్ల స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇది 40 కోట్లు దాటింది.

English summary

ఎన్నికలు: సోషల్ మీడియాకు ప్రకటనల ద్వారా రూ.12వేల కోట్లు, 87వేల వాట్సాప్ గ్రూప్‌లు | 87,000 WhatsApp Groups May Target Voters With Political Messages: Report

The first phase of voting begins from April 11 and WhatsApp - and not its parent company Facebook - has turned out to be the biggest social media platform for more than 87,000 groups to target millions with political messaging.
Story first published: Monday, March 25, 2019, 18:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X