పన్ను ఎగవేతదారులను క్షమించి వదిలేయండి...తాజాగా పన్నులు కట్టాలని ప్రోత్సహించండి: కేసిఆర్
ఇప్పటి వరకు ఉన్న పన్ను ఎగవాతదారుల క్షమించి వదిలేయండి...అప్పుడే సరికోత్తగా పన్నుకట్టేందుకు ముందుకు వస్తారని సూచించారు తెలంగాణ సిఎమ్ కేసిఆర్ ..కాగా ఇలాంటీ క్షమాభిక్షలు విదేశాల్లో ఫలితాలను కనబరిచాయని ఉదహరించారు..రాష్ట్రంలో పర్యటించిన 15వ ఆర్ధిక సంఘని సూచించారు..ఈ సంధర్భంగా అర్ధిక సంఘం ముందు పలు కీలక ప్రతిపాదనలు పెట్టారు సిఎమ్ కేసిఆర్..
ఇలాంటీ ఆమ్నెస్టీ ద్వార ఇండోనేషిలో 2016 -17 ఆర్ధిక సంవత్సరంలో 24 లక్షల కోట్ల బ్లాక్ మనిని బయటకు తీశారని ఆయన వెళ్లడించారు..ఇక ఇటలీలో సైతం 2009 లో సుమారు పది లక్షల కోట్ల రుపాయాలను బయటపెట్టగలిగారని వివరించారు...ఇండియా లో కూడ ఇలాంటీ స్కీమ్ లు ప్రవేశపెడితే మంచి ఫలితాలు వస్తాయని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు..
కాగా దేశంలో నల్లధనం బయటకు వస్తే మౌలిక వసతులు కల్పించవచ్చన్నారు...రాబోయో అయిదు సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి రక్షీతనీరు అందించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని కేసిఆర్ తెలిపారు..ఇందుకోసం సుమారు పది లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు...భారత దేశంలో ప్రస్థుతం కేవలం ఎనిమిది నుండి పది రాష్ట్రాలు మాత్రమే అభివృద్దిని సాధించే ప్రక్రియలో ఉన్నాయని మిగిలిన రాష్ట్రాలు వెనకబడి ఉన్నాయని పేర్కోన్నారు..వెనకబడిన రాష్ట్రాలను అభివృద్ది ఫథంలోకి తీసుకు వచ్చే నూతన ఆర్ధిక విధానాలను తీసుకురావల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు...
కాగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ పన్ను చెల్లింపుదారులుగా జాతి నిర్మాణంలో భాగస్వాముడు, ఒక్క రుపాయి కట్టాల్సి ఉన్నా స్వచ్ఛందంగా ముందుకువచ్చి చెల్లించాలి, అని సిఎమ్ కేసిఆర్ ఈ సంధర్భంగా అన్నారు...