నేడే బడ్జెట్: ఆదాయపన్ను పరిమితిలో ఊరట కలిగేనా, వారికి కూడా వరాలు?

న్యూఢిల్లీ: కేంద్రమంత్రి పీయూష్ గోయల్ నేడు (ఫిబ్రవరి 1వ తేదీ) కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. సార్వత్రిక ఎన్నిలకు ముందు మోడీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ మధ్యంతర బడ్జెట్‌లో.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఏం చేస్తారనేది ఆసక్తికరం. 2014లో గెలిచిన ఎన్డీయేకు.. ఈ టర్మ్‌కు ఇది చివరి బడ్జెట్. మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు.. ఈ నాలుగు నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ రోజు మోడీ సర్కార్ ప్రకటించే వరాలపై చర్చ సాగుతోంది.

ఈ బడ్జెట్‌లో ఆదాయపన్ను పరిమితి రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు పెంచే అవకాశముందని చెబుతున్నారు. అలాగే రైతులకు వరాలు కురిపించే అవకాశముంది. పట్టణ, గ్రామీణ ప్రజలకు కూడా వరాలు కురిపించే అవకాశాలు ఉంటాయి.

ఈ సమావేశాల్లో ఎలాంటి కాంట్రోవర్షియల్ బిల్స్ పాస్ చేయవద్దని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. అన్ని పక్షాలు అంగీకరించే బిల్లులే పాస్ అయ్యే అవకాశముంది.

Budget 2019 LIVE: What sops will Modi sarkar dole out?

ప్రధానంగా ఆదాయపన్ను పరిమితిపై కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులకు మంచి ఊరట లభించవచ్చునని భావిస్తున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక మొదటిసారి ఆదాయపన్ను పరిమితిని 2 లక్షల నుంచి 2.5 లక్షలకు పెంచింది.

ఎన్డీయే ప్రభుత్వం 2014 మేలో అధికారంలోకి వచ్చింది. 2014-2015కు గాను బడ్జెట్ ప్రవేశపెట్టింది. అలాగే 2015-16, 2016-17, 2017-18, 2018-19 ప్రవేశపెట్టింది. ఎన్నికలు ఉన్నందున 2019-20కి గాను పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. కాబట్టి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతోంది. ఆర్థిక సంవత్సరం 2019 ఏప్రిల్ 1న ప్రారంభమై 2020 మార్చి 31 ముగుస్తుంది. అయితే ఈ ప్రభుత్వ పాలన మే 26, 2019తో ముగియనుంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+