మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఒక్క రోజు ముందు మార్కెట్లు పాజిటివ్ నోట్తో ముగిశాయి. సెన్సెక్స్ 665.44 పాయింట్ల లాభంతో ముగిసింది. అంటే 1.87శాతం లాభంతో 36,256.69 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 179.15 పాయింట్లకు ఎగబాకి 1.86శాతం అధికంతో 10,830.95 పాయింట్లు నమోదు చేసింది. గత కొద్దిరోజులుగా నష్టాల బాట పడుతున్న మార్కెట్లు గురువారం లాభాలతో ముగియడం శుభపరిణామం అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎఫ్&ఓ ఎక్స్పైరీ కావడం కూడా మార్కెట్లు లాభాల బాట పట్టడానికి ఒక కారణం కావచ్చిన నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు కేంద్రం శుక్రవారం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో కొన్ని పాజిటివ్ వైబ్స్ కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్లు అమాంతం పెరిగిపోయాయని వెల్లడించారు. అంతేకాదు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రైతులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాల ప్రజలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దీంతో రేపు కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ఏదో మ్యాజిక్ చేయబోతోందని నిపుణులు భావిస్తున్నారు.

రామ్నాథ్ ప్రసంగంతో ఏదో ఆశ నెలకొందని అందుకే మార్కెట్లు లాభాలతో ముగిసినట్లు తెలుపుతున్నారు విశ్లేషకులు. మధ్యతరగతి కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలకు, పొదుపు పథకాల్లో ఏదో ఆశావాహక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేపటి బడ్జెట్లో మార్కెట్లు ఏదో మంచిని ఆశిస్తున్నాయని అందుకే లాభాలబాట పట్టినట్లు అషికా స్టాక్ బ్రోకింగ్ ఏవీపీ సంజీవ్ జైన్ చెప్పారు. అంతేకాదు రూపాయి కూడా బలపడటం మార్కెట్ సెంటిమెంట్ను కూడా బలోపేతం చేసింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications