మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఒక్క రోజు ముందు మార్కెట్లు పాజిటివ్ నోట్తో ముగిశాయి. సెన్సెక్స్ 665.44 పాయింట్ల లాభంతో ముగిసింది. అంటే 1.87శాతం లాభంతో 36,256.69 వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ 179.15 పాయింట్లకు ఎగబాకి 1.86శాతం అధికంతో 10,830.95 పాయింట్లు నమోదు చేసింది. గత కొద్దిరోజులుగా నష్టాల బాట పడుతున్న మార్కెట్లు గురువారం లాభాలతో ముగియడం శుభపరిణామం అని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎఫ్&ఓ ఎక్స్పైరీ కావడం కూడా మార్కెట్లు లాభాల బాట పట్టడానికి ఒక కారణం కావచ్చిన నిపుణులు అభిప్రాయపడ్డారు. అంతేకాదు కేంద్రం శుక్రవారం ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో కొన్ని పాజిటివ్ వైబ్స్ కనిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్కెట్లు అమాంతం పెరిగిపోయాయని వెల్లడించారు. అంతేకాదు బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రైతులు, పేదలు, మధ్యతరగతి కుటుంబాల ప్రజలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. దీంతో రేపు కేంద్రం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో ఏదో మ్యాజిక్ చేయబోతోందని నిపుణులు భావిస్తున్నారు.

రామ్నాథ్ ప్రసంగంతో ఏదో ఆశ నెలకొందని అందుకే మార్కెట్లు లాభాలతో ముగిసినట్లు తెలుపుతున్నారు విశ్లేషకులు. మధ్యతరగతి కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలకు, పొదుపు పథకాల్లో ఏదో ఆశావాహక స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రేపటి బడ్జెట్లో మార్కెట్లు ఏదో మంచిని ఆశిస్తున్నాయని అందుకే లాభాలబాట పట్టినట్లు అషికా స్టాక్ బ్రోకింగ్ ఏవీపీ సంజీవ్ జైన్ చెప్పారు. అంతేకాదు రూపాయి కూడా బలపడటం మార్కెట్ సెంటిమెంట్ను కూడా బలోపేతం చేసింది.
More From GoodReturns

ఇరాన్ దాడుల తర్వాత దుబాయ్ తిరిగి సాధారణ స్థితికి.. నేడు మార్కెట్లు ఓపెన్.. తగ్గిన సంక్షోభం ప్రభావం..

ఇరాన్ యుద్ధంతో స్టాక్ మార్కెట్లో భయాందోళన..728 పాయింట్లు పడిపోయిన గిఫ్ట్ నిఫ్టీ.. భారీగా పెరిగిన ఇండియా VIX..

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

BSE: స్టాక్ మార్కెట్లో సరికొత్త ట్రెండ్.. సెన్సెక్స్లోనే కాకుండా ఇకపై వీటిలోనూ ట్రేడింగ్ చేయెచ్చు!

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..



Click it and Unblock the Notifications