పీఎస్‌బీ అధికారులతో భేటీకానున్న ఆర్థిక మంత్రి

ఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల అధికారులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ సోమవారం భేటీ కానున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సమావేశం జరగనున్నట్లు సమాచారం. మిడిల్ టర్మ్ బడ్జెట్ సమావేశాలకు 3 రోజుల ముందుగా జరగనున్న మీటింగ్ చర్చానీయాంశంగా మారింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ హాజరుకానున్న ఈ భేటీలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, మొండి పద్దులు, లోన్ల మంజూరు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.

కేంద్రం తీసుకున్న కొత్త విధానాలతో ప్రభుత్వ రంగ బ్యాంకులు మొండి బకాయిల వసూళ్లల్లో ముందడుగు వేశాయి. 2018 మార్చినాటికి దాదాపు 23వేల కోట్ల రూపాయల మొండి పద్దులను రికవరీ చేశాయి. ఇక ఈ ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించి మొదటి హాఫ్ పోర్షన్ ముగిసేసరికి 60 వేల 700 కోట్ల రూపాయల మేర మొండి బకాయిలు వసూలు చేసుకోగలిగాయి.

central finance minister meeting with psb officials on monday

ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి ఈ మొత్తం మరింత పెరగనుంది. మొదటిసారి తాత్కాలిక ఆర్థిక మంత్రిగా పీయూష్ గోయల్ పనిచేసిన సందర్భంలో (అరుణ్ జైట్లీ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడ్డ సమయంలో), పీఎస్‌బీ లకు భారంగా మారిన మొండి పద్దులు వసూలు చేసే విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదానిపై కమిటీని నియమించారు. ఆ కమిటీ సూచనలు ప్రభుత్వ రంగ బ్యాంకులు అనుసరించడంతో.. కొంతమేర మొండి పద్దులు రికవరీ కావడానికి దోహదపడ్డాయి.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+