రూ. 2 లక్షల వరకూ రైతుల సరుకుల అమ్మకాలకు పాన్ అవసరం లేదు
నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలను కట్టడి చేసేందుకు కేంద్రం చాలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా చాలా చోట్ల గుర్తింపు వివరాలు ఉంటేనే క్రయవిక్రయాలు జరిగే విధంగా వివిధ మంత్రిత్వ శాఖలు నిబ
నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలను కట్టడి చేసేందుకు కేంద్రం చాలా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా చాలా చోట్ల గుర్తింపు వివరాలు ఉంటేనే క్రయవిక్రయాలు జరిగే విధంగా వివిధ మంత్రిత్వ శాఖలు నిబంధనలు రూపొందించాయి. అయితే ఈ విధమైన నిబంధనల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతులు స్వల్ప ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి రూ.2 లక్షల కంటే తక్కువ రైతులు చేసే అమ్మకాలకు పాన్ అవసరం ఉందా అనే వినతులు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ)కు అందాయి. ఈ విషయమై సీబీడీటీ శుక్రవారం స్పష్టత ఇచ్చింది. రోజుకు రూ.2 లక్షల లోపు చేసే నగదు విక్రయాలకు రైతులకు పాన్ వివరాలు తెలిపే అవసరం లేదని చెప్పారు.

ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టం-1961లో మార్చిన నిబంధనల మేరకు వ్యవసాయదారులు, కౌలుదారులు సైతం తమ ఉత్పత్తులను అమ్మాలంటే పాన్ వివరాలు ఇవ్వాల్సి ఉందని వివిధ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దీనిపై అందరికీ స్పష్టత వచ్చినట్లయింది. ఒక రోజులో రైతు అమ్మే సరకు రూ.2 లక్షల లోపు ఉంటే పాన్ సంఖ్య తెలపాల్సిన అవసరం లేదు. అదే విధంగా కౌలుదారులు సైతం పాన్ లేదా ఫారం 60 ఇచ్చే అవసరం లేదని సీబీడీటీ, రెవెన్యూ శాఖ స్పష్టతనిచ్చాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications