టెలికాం దిగ్గజాలకు భారీ పెనాల్టీకి రంగం సిద్ధం: నాసిరకం సేవల వల్లే
టెలికాం కంపెనీలు కస్టమర్లకు నాసిరకం సేవలందించిన కారణంగా భారీగా జరిమానాలు విధించే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డాట్)కు ఉందని అటార్నీ జనరల్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీంతో ఎయిర్టెల్,
టెలికాం కంపెనీలు కస్టమర్లకు నాసిరకం సేవలందించిన కారణంగా భారీగా జరిమానాలు విధించే అధికారం డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం (డాట్)కు ఉందని అటార్నీ జనరల్ అభిప్రాయ పడినట్లు తెలుస్తోంది. దీంతో ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థలపై రూ. 3,050 కోట్ల పెనాల్టీలు విధించడానికి రంగం సిద్దమైంది. సేవల నాణ్యతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు టెలికాం ఆపరేటర్లపై టెలికాం శాఖ పెనాల్టీలను విధించవచ్చని అటార్నీ జనరల్ అభిప్రాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

సేవల నాణ్యతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎయిర్టెల్, వొడాఫోన్లు ఒక్కోదానిపై రూ. 1,050కోట్లు, ఐడియాపై రూ.950 కోట్లు పెనాల్టీలు విధించాలని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) సిఫార్సు చేసింది. కాల్స్ ఫెయిల్యూర్లు ఎక్కువగా ఉండడం, రిలయన్స్ జియోకోసం ఏర్పాటు చేసిన ఇంటర్కనెక్ట్ పాయింట్ల వద్ద రద్దీ వటి కారణాల దృష్ట్యా ఈ మూడు కంపెనీలు లైసెన్స్ షరతులు, సేవల నాణ్యతకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు డాట్కు పంపిన సిఫార్సుల్లో ట్రాయ్ వివరించింది. ఇదిలా ఉండగా, దీనిపై డాట్ గత వారం అటార్నీ జనరల్(ఏజీ) అభిప్రాయాన్ని కోరింది. ఇప్పుడున్న టెలికాం కంపెనీలు తగినన్ని ఇంటర్కనెక్ట్ పాయింట్లను సమకూర్చకపోవడం వల్ల తమ నెట్వర్క్పై 75 శాతానికి పైగా కాల్స్ ఫెయిల్ అవుతున్నాయని రిలయన్స్ జియో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ట్రాయ్ ఈ సిఫార్సులు చేసిట్లు సమాచారం.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications