మళ్లీ మార్కెట్లోకి మ్యాగీ: ఉత్పత్తికి నెస్లే సన్నాహాలు
న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ మళ్లీ అమ్మకాలకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచి భారతీయ మార్కెట్లలో మళ్లీ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను ప్రారంభించాలని నెస్లే ఇండియా సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. కర్నాటక, పంజాబ్, గోవాల్లోని తమ ప్లాంటలో మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిని నెస్లే ఇండియా ప్రారంభించింది.
బాంబై హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా ఉత్పత్తి చేసిన బ్యాచ్ల్లోని ఉత్పత్తులను మూడు లాబరేటరీలకు పరీక్షల నిమిత్తం పంపుతామని నెస్లే ఇండియా బిఎస్కి వెల్లడించింది. ఈ లాబరేటరీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మ్యాగీ నూడుల్స్ను స్టోర్లలో విక్రయిస్తామని పేర్కొంది.
ప్రస్తుతానికి మూడు ప్లాంట్లలో మ్యాగీ ఉత్పత్తిని ప్రారంభించిన నెస్లే ఇండియా త్వరలో దేశంలోని మిగిలిన ప్లాంటన్నింటిలో ఉత్పత్తి ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అథారిటీలతో ఉత్పత్తి ప్రారంభానికి సంబంధించి చర్చలు జరుపుతోంది. మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారన్న వార్తలపై బీఎస్ఈ, నెస్లే ఇండియాను వివరణ కోరింది.
ఎంఎస్జి పాళ్లు అధికంగా ఉన్నాయనే కారణంతో ఈ ఏడాది మే నెలలో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై ఎఫ్ఎస్ఎస్ఎ దేశ వ్యాప్తంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో నెస్లే ఇండియా మొత్తం మ్యాగీ ఉత్పత్తిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుని, వాటిని ధ్వంసం చేసింది. దీంతో కంపెనీకి దాదాపు రూ. 435 కోట్ల నష్టం వాటిల్లింది.
మళ్లీ మార్కెట్లోకి మ్యాగీ: ఉత్పత్తికి నెస్లే సన్నాహాలు
మ్యాగీ నూడుల్స్ మళ్లీ అమ్మకాలకు సిద్ధమైంది. వచ్చే నెల నుంచి భారతీయ మార్కెట్లలో మళ్లీ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను ప్రారంభించాలని నెస్లే ఇండియా సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.
మళ్లీ మార్కెట్లోకి మ్యాగీ: ఉత్పత్తికి నెస్లే సన్నాహాలు
కర్నాటక, పంజాబ్, గోవాల్లోని తమ ప్లాంటలో మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిని నెస్లే ఇండియా ప్రారంభించింది. బాంబై హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా ఉత్పత్తి చేసిన బ్యాచ్ల్లోని ఉత్పత్తులను మూడు లాబరేటరీలకు పరీక్షల నిమిత్తం పంపుతామని నెస్లే ఇండియా బిఎస్కి వెల్లడించింది.
మళ్లీ మార్కెట్లోకి మ్యాగీ: ఉత్పత్తికి నెస్లే సన్నాహాలు
ఈ లాబరేటరీల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత మ్యాగీ నూడుల్స్ను స్టోర్లలో విక్రయిస్తామని పేర్కొంది. ప్రస్తుతానికి మూడు ప్లాంట్లలో మ్యాగీ ఉత్పత్తిని ప్రారంభించిన నెస్లే ఇండియా త్వరలో దేశంలోని మిగిలిన ప్లాంటన్నింటిలో ఉత్పత్తి ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల అథారిటీలతో ఉత్పత్తి ప్రారంభానికి సంబంధించి చర్చలు జరుపుతోంది.
మళ్లీ మార్కెట్లోకి మ్యాగీ: ఉత్పత్తికి నెస్లే సన్నాహాలు
మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తిని తిరిగి ప్రారంభించారన్న వార్తలపై బీఎస్ఈ, నెస్లే ఇండియాను వివరణ కోరింది. ఎంఎస్జి పాళ్లు అధికంగా ఉన్నాయనే కారణంతో ఈ ఏడాది మే నెలలో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై ఎఫ్ఎస్ఎస్ఎ దేశ వ్యాప్తంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
మళ్లీ మార్కెట్లోకి మ్యాగీ: ఉత్పత్తికి నెస్లే సన్నాహాలు
దీంతో నెస్లే ఇండియా మొత్తం మ్యాగీ ఉత్పత్తిని మార్కెట్ నుంచి వెనక్కి తీసుకుని, వాటిని ధ్వంసం చేసింది. దీంతో కంపెనీకి దాదాపు రూ. 435 కోట్ల నష్టం వాటిల్లింది.