కరోనా మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఉద్యోగుల భద్రతకు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఇందుకోసం ఎన్నో కంపెనీలు కార్యాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూస్తున్నాయి. కార్యాలయాల్లో శానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లేందుకు ఆందోళన చెందుతున్నారు.

ఇన్ఫోసిస్ రిటర్న్ టు వర్క్ ప్లేస్
కరోనా ఎక్కడి నుండి, ఎలా వస్తుందో తెలియని పరిస్థితి.. అదే సమయంలో ఉద్యోగం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా సోకే అవకాశాలు దాదాపు లేకపోవడం అంటే ఉద్యోగులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఆ దిశలో అడుగు వేసింది. ఇందులో భాగంగా ఇన్ఫీ 'రిటర్న్ టు వర్క్ ప్లేస్' పరిష్కారాలను గురువారం ఆవిష్కరించింది.

ఈ జాగ్రత్తలు
పెరిగిన శరీర ఉష్ణోగ్రతల స్క్రీనింగ్తో పాటు మాస్కులు ధరించడం, ఆఫీసుల్లో ఎంతమంది పని చేస్తున్నారు తదితర అంశాలకు క్లౌడ్, ఎడ్జ్ ఆధారిత పరిష్కారాలను తీసుకు వచ్చింది. అయితే ఇవి వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారాన్ని గ్రహించవని, కృత్రిమ మేధ బదులుగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, విజన్ అనలటిక్స్, ఎడ్జ్ కంప్యూటింగ్, 5జీ, ఆర్ఎఫ్ఐడీ, బయోమెట్రిక్స్, సంజ్ఞల నియంత్రణ ఆధారంగా మానవ జోక్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవచ్చునని ఇన్ఫోసిస్ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ పరిష్కారాలు కూడా డేటా గోప్యత ప్రమాణాలు, ఎఫ్డీఏ, ఎఫ్సీసీ, ఐఎస్ఓ, ఐఈసీ నిబంధనలకు కట్టుబడి ఉంటాయన్నారు. ఇందులో పెరిగిన శరీర ఉష్ణోగ్రతల (ఈబీటీ) తనిఖీలను బెంగళూరు, పుణే కార్యాలయాల్లో ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు.

ఏఐ సమాధానాలు, ఆటోమేషన్ శానిటేషన్
తమ క్లయింట్స్ కార్యాలయాలకు కూడా ఈ పరిష్కారాల ద్వారా కరోనా నిరోధకంగా ఉంటాయని ఇన్ఫోసిస్ చెబుతోంది. దీంతో ఉద్యోగులు ఎలాంటి భయాలు లేకుండా కార్యాలయాలకు వస్తారని వెల్లడిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ పరిష్కారాన్ని కూడా ఇన్ఫీ తీసుకు వచ్చింది. ఉద్యోగులు తిరిగి విధులకు హాజరు కావడానికి సమస్యలు ఉంటే సమాధానాలు ఇస్తుంది. ఆఫీసుల్లో సీట్లు, సాంద్రత, కామన్ ఏరియాల్లో ఆటోమేషన్ శానిటేషన్ పరిష్కారాలు సూచించింది.
More From GoodReturns

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications